India Corona: అదుపులో కరోనా.. రెండు వేల దిగువకు కొత్త కేసులు

స్వల్పహెచ్చుతగ్గులతో దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది.

Published : 24 May 2022 10:03 IST

192.5 కోట్ల మేర టీకా డోసుల పంపిణీ 

దిల్లీ: స్వల్పహెచ్చుతగ్గులతో దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. సోమవారం 4 లక్షల మంది వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 1,675 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 400 మేర కేసులు తగ్గాయి. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.26 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 1,635 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. క్రియాశీల కేసులు 14,841కి చేరాయి. రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా.. క్రియాశీల కేసుల రేటు 0.03 శాతంగా కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 31 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 5,24,490 మంది మహమ్మారికి బలయ్యారు. గత ఏడాది ప్రారంభం నుంచి 192.5 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో 13.76 లక్షల మంది నిన్న టీకా వేయించుకున్నారని కేంద్రం వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని