Mann ki Baat: ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది: ప్రధాని మోదీ
మన్ కీ బాత్లో భాగంగా ప్రసంగించిన ప్రధాని మోదీ దేశ పౌరులకు కీలక విజ్ఞప్తి చేశారు. పండుగ సీజన్లో ప్రతి ఒక్కరు దేశంలో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని సూచించారు.
దిల్లీ: ప్రపంచ వాణిజ్యానికి ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్ దశాబ్దాలపాటు ఆధారంగా నిలుస్తుందని, చరిత్రలో దీన్ని గుర్తుచేసుకుంటారని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. మన్ కీ బాత్ (Mann ki Baat) కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై ప్రసంగించిన ప్రధాని.. దేశం గొప్ప వాణిజ్య శక్తిగా ఉన్నప్పుడు సిల్క్ రూట్ను ఉపయోగించదనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జీ20 సదస్సు సందర్భంగా ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్’’ను భారత్ సూచించిందని చెప్పారు. చంద్రయాన్-3 విజయం, జీ20 సదస్సు నిర్వహణ దేశంలో ప్రతి పౌరుడి ఆనందాన్ని రెట్టింపు చేశాయని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి తనకు వచ్చిన సందేశాల్లో ఎక్కువగా ఈ రెండింటి గురించే ప్రస్తావించినట్లు తెలిపారు.
జీ20 అధ్యక్ష హోదాలో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం ద్వారా భారత దేశ నాయకత్వాన్ని ప్రపంచం గుర్తించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన ‘భారత్ మండపం’ ప్రస్తుతం సెలబ్రిటీగా మారిందని, ప్రజలు దాని ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారని అన్నారు. సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ రంగం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి కల్పిస్తుందని, పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిత్తశుద్ధి అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు.
‘‘జీ20 సదస్సు నిర్వహణ తర్వాత భారత దేశ చిత్తశుద్ధి మరింత పెరిగింది. ఈ సమావేశాల సందర్భంగా భారత్కు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, మన సంస్కృతి, వారసత్వ సంపదలు, వైవిధ్యం గురించి తెలుసుకున్నారు. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్కు, కర్ణాటకలోని హోయసల ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కడం ఎంతో గర్వించదగిన విషయం. ఈ రెండింటి గుర్తింపుతో భారత్లో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా 42కు చేరింది’’ అని ప్రధాని మోదీ అన్నారు.
స్థానిక భాషల్లో చట్టాలు.. ఐపీసీనీ మారుస్తున్నాం
అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు ‘స్వచ్ఛతా హీ సేవా’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని కోరారు. అదే గాంధీజీకి అర్పించే నిజమైన నివాళి అని ప్రధాని అభిప్రాయపడ్డారు. పండుగ సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశ పౌరులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు భారత్లో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్