ఆ ఘనత దేశ మహిళలదే
మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం ఘనత దేశంలోని మహిళలందరికీ దక్కుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని మోదీ వ్యాఖ్య
వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన
వారణాసి: మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం ఘనత దేశంలోని మహిళలందరికీ దక్కుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నారీ శక్తి వందన్ అధినియమ్లో వందన్ (మహిళలను పూజించడం) పేరు పెట్టడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ఆరోపించారు. తన నియోజకవర్గం వారణాసిలో శనివారం కేవలం మహిళలే హాజరైన సదస్సులో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సభలో పాల్గొన్న మహిళలంతా ప్రధానిపై పూలను చల్లుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా నాయకత్వం అనేది ప్రపంచానికి ఇప్పుడు కొత్తగానీ మన దేశంలో పురాణాల నుంచీ ఉందని తెలిపారు. మహాదేవుడి కంటే ముందే మనం తల్లి పార్వతిని, గంగను పూజించామని చెప్పారు. పూజించడం, గౌరవించడం మధ్య ప్రతిపక్షాలకు తేడా తెలియదని, అటువంటి వ్యతిరేక ఆలోచనా ధోరణిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో ఆస్తులు, కార్లు, దుకాణాలు పురుషుల పేరుమీదే రిజిస్టరయ్యేవని, తాను వచ్చాక మహిళల పేరుమీద రిజిస్టరు చేయడం ప్రారంభించామని చెప్పారు.
- ప్రధాని మోదీ వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల్లో రూ.450 కోట్లతో ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ హంగులతో నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, సచిన్ తెందుల్కర్, రవి శాస్త్రి, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్నారు. ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్లైట్లు, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్ స్టాండ్ నిర్మించనున్నారు. గంగా ఘాట్ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనుంది. స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం ఆకును పోలిన మెటాలిక్ షీట్లను ఏర్పాటు చేయనున్నారు. పైకప్పు అర్ధ చంద్రాకారాన్ని ప్రతిబింబించనుంది. సుమారు 30,000 సీటింగ్ సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు.
- ఉత్తర్ ప్రదేశ్లో అవసరార్థ పిల్లల కోసం 16 గురుకుల పాఠశాలలను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. వాటికి మాజీ ప్రధాని వాజ్పేయీ పేరు వచ్చేలా ‘అటల్ ఆవాసియా విద్యాలయాస్’ అని పెట్టారు. రూ.1,115 కోట్లతో ఈ పాఠశాలలను నిర్మిస్తున్నారు. 10 నుంచి 15 ఎకరాల్లో ఉండే ఒక్కో పాఠశాలలో 1,000 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. కూలీలు, నిర్మాణ రంగ కార్మికుల పిల్లలతోపాటు కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు ఇందులో ప్రవేశం కల్పిస్తారు. వీటిని జాతికి అంకితం చేసే ముందు కొందరు విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.
- కాశీలోని ప్రజలే ఆ నగరానికి బ్రాండ్ అంబాసిడర్లని మోదీ పేర్కొన్నారు. పాఠశాలలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశీలోని విశేషాలను పర్యాటకులకు చూపించడంలో పోటీ పడాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
రహదారిపై గుంతలు మాయం!
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!