Project Cheetah: మరణాలు ఆగాలంటే.. ఆ చీతాలు రావాల్సిందే!
విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో.. ఆఫ్రికా వైద్యనిపుణులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కీలక అంశాలు వెల్లడించారు.
దిల్లీ: ‘ ప్రాజెక్ట్ చీతా’లో (Project Cheetah) భాగంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల మరణాలు కలవరపరుస్తున్నాయి. దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి 20 చీతాలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు తీసుకురాగా..ఇప్పటి వరకు 6 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. చీతాల మరణాలకు చెక్ పెట్టేందుకు నిపుణులు పలు సూచనలు చేశారు. ఈ మేరకు ప్రాజెక్ట్ చీతాలో భాగమైన ఆఫ్రికా నిపుణులు భారత ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కీలక అంశాలు వెల్లడించారు.
యుక్త వయస్సు కీలకం
నడి వయస్సు చీతాలకంటే యుక్తవయస్సులో ఉన్నవాటిని తీసుకొస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు. మరణాల రేటు కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అటవీ ప్రాంతంలో తిరుగుతున్న వాహనాలు, మనుషుల సంచారానికి అలవాటు పడిన వాటిని ఎంపిక చేసుకోవడం మంచిదని తెలిపారు. దీంతో అవి భీతిల్లకుండా ఉంటాయని, అంతేకాకుండా వాటి పర్యవేక్షణ, వైద్యం కూడా సులువవుతుందని పేర్కొన్నారు. సాధారణంగా యుక్త వయస్సులో ఉన్న చీతాలకు కోపం తక్కువ. వాటిలో అవి పోట్లాడుకోవు. వ్యాధి నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా త్వరగా కోలుకునేందుకు అవకాశమెక్కువ.
నడివయస్సు దాటిన చీతాలకు వ్యాధి నిరోధక శక్తి క్రమంగా సన్నగిల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు వాతావరణంలో కలిగే మార్పులు అవి తట్టుకోవడం కాస్త కష్టం. దీంతో అవి మృత్యువాత పడుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. భారీ మొత్తంలో వెచ్చించి..తీరా వయస్సు మళ్లిన చీతాలను దిగుమతి చేసుకుంటే.. వాటి జీవితకాలం తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని నిపుణులు నివేదికలో పేర్కొన్నారు. చీతాల దిగువతి వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని యుక్తవయస్సులో ఉన్న చీతాలకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
మరో 10 చీతాలు రెడీ
భారత్లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దక్షిణాఫ్రికా వైద్యనిపుణులు మరో 10 చీతాలను సిద్ధం చేశారు. భారత్ అధికారుల సూచన మేరకు 19 నెలల నుంచి 3 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వాటిని ఎంపిక చేశారు. వీటిని 2024 ప్రారంభంలో వీటిని ఇండియాకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు భారత్లో చీతాలు మృతి చెందడంపై ఆందోళన అక్కర్లేదని ఆఫ్రికా నిపుణుల బృందం స్పష్టం చేసింది. రేడియో కాలర్ వల్లే చీతాలు మృతి చెందుతున్నాయంటూ మీడియాలో వార్తలు రావడం దురదృష్టకరమని పేర్కొంది. చీతాలు మృతి ముందుగా ఊహించిందేనని.. మరణాలు ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని స్పష్టం చేసింది.
‘ఉల్లి ఘాటు’తో విమానం వెనక్కి..! అసలేం జరిగిందంటే..!
చీతాల సంఖ్యను అభివృద్ధి చేసేందుకు దక్షిణాఫ్రికా చేసిన 10 ప్రయత్నాల్లో 9 విఫలమయ్యాయని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఆ వైఫల్యాలే.. కొత్తమార్గాలను అన్వేషించేందుకు ఉపకరించాయని అంటున్నారు.‘‘ దక్షిణాఫ్రికాలో చీతాల సంఖ్య పెరిగేందుకు 26 ఏళ్లు పట్టింది. మొత్తం 10 సార్లు ప్రయత్నించాం. ఈ ప్రయత్నాల్లో 279 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. అయితే, భారత్లో అలాంటి పరిస్థితులు తలెత్తుతాయని అనుకోవడం లేదు. భారత్లో ఇలాంటి నష్టాలు ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా బాలారిష్టాలు తప్పవు.’’అని దక్షిణాఫ్రికా వన్యప్రాణుల నిపుణుడు విన్సెంట్ వాన్ డెర్ మెర్వే పేర్కొన్నారు.
సంతాన సామర్థ్యం
మరోవైపు విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల సంతాన సామర్థ్యంపై నిపుణులు కొన్ని అంశాలను లేవనెత్తారు. గతంలో తీసుకొచ్చిన 7 ఆడ చీతాల్లో కేవలం ఒక్కటి మాత్రమే పిల్లలకు జన్మనిచ్చి ‘సూపర్ మామ్’గా పేరొందిందని చెప్పిన నిపుణులు.. ఆ ఆడ చీతా జన్యువులపై పరిశోధన చేసి ఆ తరహా చీతాలను దిగుమతి చేసుకుంటే ప్రయోజనం ఉంటుందని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదర్స్ డే వేళ మోదీకి స్పెషల్ గిఫ్ట్.. థాంక్స్ చెప్పిన ప్రధాని
పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీకి ఊహించని బహుమానం అందింది. మాతృ దినోత్సవం రోజున మోదీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ చిత్రాన్ని ఆ పార్టీ అభిమానులు ఆయనకు అందించారు. -
దిల్లీలో ఆసుపత్రులకు బాంబు బెదిరింపుల కలకలం..
దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం సృష్టించాయి. -
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
India-China: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. -
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మ్యానువల్ ఫర్ మామ్స్ టు బి’ పుస్తకంలో బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ అంథోనీ వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. -
ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ చూపించారు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను ఆయన సాధారణ పౌరులకు చూపించారని ఆరోపించారు. -
ఆయనకు 84.. ఆమెకు 66
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చించోలి రహీమాపుర్కు చెందిన విఠల్ ఖండారే (84)కు ఆయన కుమారులు, కుమార్తెలు 66 ఏళ్ల వృద్ధురాలితో ఘనంగా రెండోపెళ్లి జరిపించారు. -
సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. -
4 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తే అథ్లెట్లకు దీర్ఘాయుష్షు
నాలుగు నిమిషాల్లోనే ఒక మైలు దూరం పరుగులు తీసే అథ్లెట్లు.. వారి సాధారణ ఆయుష్షు కన్నా ఐదేళ్లు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. -
వారణాసి గంగా హారతిలో అమిత్ షా, యోగి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్లో జరిగిన గంగా హారతికి హాజరయ్యారు. -
చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. -
ఓ ఆదివాసీ ప్రశ్నకు వ్యంగ్యంగా బదులిచ్చానంతే
రత్లాం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా తాజాగా చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ
సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్) మార్కెట్లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. -
నింగిలో రంగురంగుల అరోరాలు
చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు