PM Modi: పేదరికంపై పోరాటానికి సాంకేతిక అస్త్రం: మోదీ
ఎఫ్డీఐలో సంస్కరణలు, డ్రోన్ నియమనిబంధనల్లో సడలింపులు, సెమీకండక్టర్ తయారీ దిశగా అడుగులు భారత దేశ పురోగతి నిదర్శనం అని ప్రధాని మోదీ అన్నారు. పేదరికంపై పోరుకు సాంకేతికతను అస్త్రంగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
బెంగళూరు: పేదరికంపై పోరాటానికి భారత్ సాంకేతికతను అస్త్రంగా ఉపయోగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బెంగళూరులో జరుగుతున్న 25వ బెంగళూరు టెక్ సమ్మిట్ 2022 సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు. భారత్ సాంకేతికతలో ఎంతో పురోగతి సాధించిందని, ఇప్పటికే దేశంలోని యువత తమ సాంకేతికత సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు.
పేదరికంపై పోరులో భాగంగా స్వమిత్వ స్కీమ్ ద్వారా భూ సర్వేకు డ్రోన్ల వినియోగాన్ని ప్రధాని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరికి జన్ధన్, ఆధార్, మొబైల్ ఫోన్ (జేఏఎం) ద్వారా అర్హులకు లబ్ధిచేకూరడంతోపాటు, వారి ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ జరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జెమ్ ఈ-కామర్స్ సంస్థ దేశంలోని చిన్న వ్యాపారులు నేరుగా వినియోగదారులకు చేరువయ్యేందుకు సాయపడుతోందని తెలిపారు.
‘‘ప్రస్తుతం పెట్టుబడిదారులకు భారత్ రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతోంది. ఎఫ్డీఐలో సంస్కరణలు, డ్రోన్ నియమనిబంధనల్లో సడలింపులు, సెమీకండక్టర్ తయారీ దిశగా అడుగులు వేయడంతోపాటు అనేక రంగాల్లో సాధిస్తున్న పురోగతి ఇందుకు నిదర్శనం’’ అని అన్నారు. కరోనా సమయంలో భారత్ చేపట్టిన సాంకేతిక ఆవిష్కరణలతో వైరస్ బాధితులను గుర్తించడం నుంచి కొవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీని సమర్థవంతంగా నిర్వహించగలిగామని ప్రధాని మోదీ తెలిపారు. ఇది భారత్లోని సాంకేతికత అభివృద్ధిని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు.
దేశ టెలికాం రంగంలో చోటుచేసుకుంటున్న సంస్కరణలతో మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ చేరువవుతోందని వెల్లడించారు. ‘‘గత ఎనిమిదేళ్లలో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య 60 మిలియన్ నుంచి 810 మిలియన్లకు, స్మార్ట్ఫోన్ ఉపయోగించేవారి సంఖ్య 150 మిలియన్ల నుంచి 750 మిలియన్లకు పెరగడం భారత్లో సాంకేతికతలో అభివృద్ధికి నిదర్శనం. 2015లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాకింగ్స్లో 81వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 40వ స్థానానికి చేరుకుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్గా భారత్ అవతరించింది. మీ పెట్టుబడులు, మా ఆవిష్కరణలు కలిస్తే అద్భుతాలు సాధించవచ్చు’’ అని ప్రధాని వ్యాపారవేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్