LPG price: వంటగ్యాస్ మంట.. ఏడాదిలో రూ.244 పెంపు
మే నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధర పెరగడం మూడోసారి కాగా గడిచిన ఏడాది కాలంలో వంటగ్యాస్ ధర ఏకంగా రూ.244 పెరగడం గమనార్హం.
ఆకాశాన్నంటుతున్న ఇంధనం, గ్యాస్ ధరలు
దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశంలో ఇంధనం, వంటగ్యాస్ (Cooking gas) ధరలు భారీగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ (LPG) ధర సిలిండర్కు మరోసారి రూ.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవి నేటి నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో సిలిండర్ (Gas Cylinder) ధర రూ.1100 దాటింది. మే నెల నుంచి ఇలా పెరగడం మూడోసారి కాగా గడిచిన ఏడాది కాలంలో వంటగ్యాస్ ధర ఏకంగా రూ.244 పెరగడం గమనార్హం.
మూడునెలల్లో రూ.153 పెంపు
ఈ ఏడాదిలోనే వంటగ్యాస్ ధర నాలుగుసార్లు పెరగగా.. కేవలం మే తర్వాతే మూడుసార్లు పెరిగింది. పెరిగిన ప్రతిసారి దాదాపు యాభై రూపాయలకు తగ్గకుండా భారాన్ని వేస్తున్నాయి. మార్చి 22వ తేదీన సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మళ్లీ మే 7న మరో యాభై పెరగగా.. మే 19న మాత్రం రూ.3.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మార్చి నెల నుంచి మొత్తంగా ఒక్కో సిలిండర్పై రూ.153.50 పెంచాయి. ఇలా గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు చూస్తే సిలిండర్ ధర రూ.244 ఎగబాకింది.
ఇక రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు మాత్రం గడిచిన మూడు నెలలుగా బ్రేక్ పడింది. మే నెలలో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.8, డీజిల్పై రూ.6 తగ్గించడంతో వాటి దూకుడుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. అదే సమయంలో వంటగ్యాస్పై రూ.200 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఉజ్వల యోజన పథకం (PM Ujjwala Yojana Scheme) కింద వంటగ్యాస్ సిలిండర్ పొందిన వారికే అది వర్తిస్తుందని తెలిపింది. దీంతో కేవలం 9కోట్ల మంది పేద మహిళలు, ఇతరులకు మాత్రమే లబ్ధిచేకూరుతోంది. మిగతా వాళ్లు మాత్రం వంటగ్యాస్కు మార్కెట్ ధర చెల్లించాల్సి వస్తోంది.
వాణిజ్య సిలిండర్పై బాదుడే..
ఇలా వంటగ్యాస్పై క్రమంగా భారం పడడంతో పలు నగరాల్లో సిలిండర్ ధర రూ.1100లు దాటింది. దేశరాజధాని దిల్లీలో సిలిండర్ ధర రూ.1053కు చేరుకోగా.. ముంబయిలో రూ.1052.50, చెన్నై-రూ.1079, కోల్కతాలో రూ.1068.50కి చేరింది. హైదరాబాద్లో మాత్రం అత్యధికంగా ఒక్క సిలిండర్కు రూ.1105 చెల్లించాల్సి వస్తోంది. ఇంధనంపై రాష్ట్రాలు విధించే వ్యాట్లు వేర్వేరుగా ఉండడం వల్ల ఆయా రాష్ట్రాల్లో వీటి ధర మారుతోంది. వంటగ్యాస్ ధర ఇలా ఉంటే, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్పైనా చమురు సంస్థలు తీవ్ర భారాన్ని మోపుతూనే ఉన్నాయి. దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ.2వేలు దాటగా ఇతర రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉంది.
ఇదిలాఉంటే, దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 85శాతం విదేశాల నుంచి దిగుమతిపైనే భారత్ ఆధారపడిన సంగతి తెలిసిందే. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో దిగుమతుల కోసం భారత్ భారీగా చెల్లింపులు చేయాల్సి వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్