Mizoram: మయన్మార్ నుంచి వందల్లో సైనికులు.. కేంద్రాన్ని ఆశ్రయించిన మిజోరం
మయన్మార్(Myanmar)లో అంతర్యుద్ధం భారత్పై ప్రభావం చూపుతోంది. ఆ దేశానికి చెందిన వందలాది సైనికులు పారిపోయి మనవైపు వస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: భారత్ పొరుగు దేశమైన మయన్మార్ (Myanmar)లో కొంతకాలంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మిలిటరీ పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య పోరు జరుగుతోంది. దీంతో మయన్మార్ ఆర్మీకి చెందిన వందలమంది సిబ్బంది మిజోరం(Mizoram) సరిహద్దుల ద్వారా భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ పరిణామాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. వారిని తిరిగివెంటనే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
మయన్మార్లో పాలన కొనసాగిస్తోన్న మిలిటరీకి కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధ బృందాలు కూటములుగా ఏర్పడి గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ ఘర్షణల వల్ల ఇప్పటివరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి మనదేశంలోకి ప్రవేశించారు. రెబల్ గ్రూప్ అరాకన్ ఆర్మీ తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో వారంతా మిజోరంలోని లాంగ్ట్లాయ్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అస్సాం రైఫిల్స్ క్యాంపుల్లో వారు ఉంటున్నట్లు తెలుస్తోంది.
దూకుడు పెంచిన కిమ్.. సముద్రగర్భంలో డ్రోన్ అణుసామర్థ పరీక్షలు
ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి లాల్దుహోమా (Lalduhoma).. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించారు. ‘ఆశ్రయం పొందేందుకు మయన్మార్ నుంచి ప్రజలు మనదేశంలోకి ప్రవేశిస్తున్నారు. మానవతా దృక్పథంతో మేం వారికి సాయం చేస్తున్నాం. ఆ దేశం నుంచి సైనికులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 400 మందిని వెనక్కి పంపించేశాం’ అని సమావేశం అనంతరం సీఎం మీడియాకు వెల్లడించారు. మయన్మార్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మిజోరం కేంద్రాన్ని అభ్యర్థించింది.
మయన్మార్లో 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి సైనిక పాలకులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో దేశంలో అంతర్యుద్ధం నెలకొంది. ఈ దాడుల్లో ‘త్రీబ్రదర్హుడ్ అలయన్స్ (టీబీఏ)’ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్డీఏఏ), టాంగ్ జాతీయ విమోచన సైన్యం(టీఎన్ఎల్ఏ), అరాకన్ ఆర్మీ(ఏఏ) భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దేశంలో అత్యంత శక్తిమంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) అధ్యక్షుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు (Supreme Court) .. మాట్లాడేటప్పుడు నిగ్రహం పాటించాలని సూచించింది. -
విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై!
విమానం రద్దు కారణంగా ఒమన్లోని ఆసుపత్రిలో ఉన్న తన భర్తను.. బతికుండగా చూడలేకపోయానంటూ కేరళకు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తంచేశారు. -
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
Mumbai hoarding collapse: బలమైన ఈదురుగాలుల ధాటికి సోమవారం ముంబయిలోని భారీ హోర్డింగ్ ఒకటి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు. -
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?
ఎన్నికల వేళ ఆప్ గంభీరమైన వివాదంలో చిక్కుకొంది. ఆ పార్టీ మహిళా ఎంపీ ఏకంగా సీఎం ఇంట్లో దాడికి గురైనట్లు పోలీసులకు వెల్లడించారు. -
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
నేడు వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీకి ప్రధాని మోదీ (Modi) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. -
ఆపరేషన్ చేసి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి లోహియానగర్లోని స్థానిక నర్సింగ్ హోంలో చేరారు. -
ముంబయి విమానాశ్రయంలో రూ.13.56 కోట్ల బంగారం పట్టివేత
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.13.56 కోట్లు విలువ చేసే బంగారం పట్టుబడింది. -
కేజ్రీవాల్ సహాయకుడు నాపై దాడి చేశారు
మద్యం కుంభకోణం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. -
‘సిజేరియన్’ శిశువులకు రెండో తట్టు టీకా తప్పనిసరి
సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానంలో జన్మించిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. -
కేజ్రీవాల్కు ఇచ్చినట్లే నాకూ బెయిలివ్వండి
లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
వీవీప్యాట్ స్లిప్పుల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్
లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీయం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిస్థాయిలో సరిపోల్చాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఏప్రిల్ 26నాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
త్రిపురకు వెళ్లి ఏనుగులను కాపాడిన అంబానీ ‘వన్ తారా’బృందం
గుజరాత్లోని జామ్నగర్కు చెందిన ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్ర సిబ్బంది జబ్బుపడిన ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకు ఏకంగా 3,500 కి.మీ. ప్రయాణించారు. -
ముంబయిలో గాలివాన బీభత్సం
కొన్నిరోజులుగా వేడి వాతావరణంతో సతమతమవుతోన్న ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. -
56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు
రాజస్థాన్లోని జైపుర్లో ఉన్న 56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం మెయిల్ రూపంలో ఈ సందేశాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
కేజ్రీవాల్ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కారణంగా దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. -
మోదీ మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సోమవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
దర్యాప్తునకు పనికొచ్చే సమాచారం అందించని కెనడా
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ (45) హత్య కేసు దర్యాప్తునకు తోడ్పడే నిర్దిష్ట సమాచారమేదీ కెనడా నుంచి భారత దర్యాప్తు సంస్థలకు అందలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం తెలిపారు. -
భారత్-ఫ్రాన్స్ సంయుక్త సైనిక శిక్షణ ‘ఎక్సర్సైజ్ శక్తి’ ప్రారంభం
భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ‘ఎక్సర్సైజ్ శక్తి’ సంయుక్త సైనిక శిక్షణ సోమవారం మేఘాలయలోని ఉమ్రోయ్లో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైందని రక్షణ శాఖ తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (3)
దిల్లీలోని ఒక పెట్రోల్ పంపు వద్ద దాడికి పాల్పడిన ఘటనలో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్, అతని కుమారుడు అనాస్ అహ్మద్పై సోమవారం బెయిల్కు వీల్లేని వారెంట్ జారీ అయినట్లు పోలీసులు తెలిపారు. -
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
Rahul gandhi: రాహుల్తో చర్చించేందుకు భాజపా సిద్ధమైంది. ఓ యువ నాయకుడికి అవకాశం ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
-
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
-
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు
-
విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై!
-
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
-
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు