Modi: పార్లమెంట్ ప్రారంభోత్సవ వివాదం.. విపక్షాలకు మోదీ స్ట్రాంగ్ కౌంటర్
New Parliament Opening: ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోదీ(PM Modi) విమర్శలు గుప్పించారు. దేశంకోసం కేంద్రం నిర్వహిస్తోన్న కార్యక్రమానికి కలిసిరాకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
దిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై అధికార, విపక్ష పార్టీల మధ్య రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకను బహిష్కరిస్తూ విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Pm Modi) పరోక్షంగా తప్పుపట్టారు. ఆస్ట్రేలియాలోని ప్రతిపక్ష పార్టీలతో పోలుస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఆరు రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని మోదీ గురువారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఈ క్రమంలో దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. (New Parliament Opening)
ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో జరిగిన సభను ప్రధాని ప్రస్తావిస్తూ.. ‘‘అందులో 20 వేలమంది పాల్గొన్నారు. ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్, మాజీ ప్రధాని, ఇతర విపక్ష ఎంపీలు, నేతలు వచ్చారు. అధికార, ప్రతిపక్ష నేతలు తమ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అందులో పాల్గొన్నారు. ఒక కమ్యూనిటీ ఈవెంట్కు వారంతా కలిసికట్టుగా హాజరయ్యారు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని విపక్షాలు బహిష్కరిస్తున్న నేపథ్యంలో.. ప్రతిపక్ష పార్టీల తీరును ప్రధాని ఇలా పరోక్షంగా దుయ్యబట్టారు.
ఇక, కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో భారత్ విదేశాలకు టీకాలు సరఫరా చేయడాన్ని అప్పట్లో విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ప్రధాని దాని గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘సంక్షోభ సమయంలో మోదీ ప్రపంచ దేశాలకు టీకాలు ఎందుకు ఇస్తున్నారని వారు ప్రశ్నించారు. ఇది బుద్ధుడు, గాంధీ తిరిగిన నేల. మనం మన శత్రువుల గురించి కూడా ఆలోచిస్తాం. మనం కరుణతో ప్రేరేపితమైన వ్యక్తులం’ అని ప్రధాని (PM Modi) వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి లేకుండా పార్లమెంట్ కొత్త భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని విపక్షాలు నిలదీస్తుండగా.. గతంలో పార్లమెంటులోని అనుబంధ భవనాలకు అప్పటి ప్రధానులు ఇందిర, రాజీవ్ గాంధీలే ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారని భాజపా విమర్శలను తిప్పికొడుతోంది. ఈ నెల 28న ప్రధాని మోదీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తాము హాజరుకాబోమంటూ 19 ప్రతిపక్ష పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీనికి ప్రతిగా భాజపా సహా 14 ఎన్డీఏ పక్షాలు స్పందించాయి. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు విపక్షాలు తిలోదకాలిస్తున్నాయంటూ ప్రకటన విడుదల చేశాయి. ఇదిలా ఉంటే.. శిరోమణి అకాలీదళ్, వైకాపా, బిజూ జనతాదళ్ హాజరవుతామని తెలిపాయి. భారాస ఈ రోజు దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం