Monsoon: సీన్ రిపీట్.. 62 ఏళ్ల తర్వాత రెండు మహానగరాలకు ఒకేసారి రుతుపవనాలు
దాదాపు 62 ఏళ్ల తర్వాత దిల్లీ, (Delhi) ముంబయి (Mumbai) మహానగరాలను నైరుతి రుతుపవనాలు (Monsoon) ఒకేసారి పలకరించాయి. గతంలో జూన్ 21,1961లో ఇలా జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi), ఆర్థిక రాజధాని ముంబయి (Mumbai) నగరాలను వర్షాలు మంచెత్తుతున్నాయి. రుతుపవనాల కారణంగా ఈ రెండు మహానగరాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. దాదాపు 62 సంవత్సరాల తర్వాత ఈ రెండు మహానగరాలను ఒకేసారి రుతుపవనాలు పలకరించాయి. భారత వాతావారణశాఖ అంచనాల ప్రకారం దిల్లీలో మరో రెండు రోజుల తర్వాత రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. కానీ, ముందుగానే వచ్చేశాయి. ముంబయికి రెండు వారాలు ఆలస్యంగా చేరుకున్నాయి. దీంతో ఒకేసారి రెండు నగరాల్లోనూ రుతుపవనాలు ప్రవేశించినట్లయింది. గతంలో జూన్ 21, 1961లో ఇలాగే రెండు మహానగరాల్లోనూ ఒకేసారి రుతుపవనాలు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తాజాగా వెల్లడించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ తోపాటు హరియాణా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు పేర్కొంది. మరో రెండు రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. తాజా వర్షాలతో దిల్లీ, పరిసర ప్రాంతాల్లో కొంత ఉపశమనం కలిగినప్పటికీ.. గురుగ్రామ్లో కొన్ని చోట్ల మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతోంది. మరోవైపు ముంబయిలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ, ఈ ఏడాది వారం రోజుల ఆలస్యంగా జూన్ 8న చేరుకున్నాయి. వర్షాలు విస్తారంగా కురిసేందుకు అనువైన పరిస్థితులు వృద్ధి చెందుతున్నప్పటికీ.. నైరుతి రుతుపవనాలతో భారత్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం కలిగింది. -
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కు గనిలో లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోల్కతాకు చెందిన ఓ విజిలెన్స్ అధికారి మృతి చెందారు. -
ఆమెపై కుట్ర చేస్తున్నారు.. సంజయ్సింగ్ది నటన: స్వాతీమాలీవాల్ మాజీ భర్త ఆరోపణలు
ఒక కుట్రలో భాగంగానే స్వాతీమాలీవాల్ (Swati Maliwal)పై దాడి జరిగిందని ఆమె మాజీ భర్త ఆరోపించారు. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
‘న్యూస్క్లిక్’(NewsClick) వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
Jaishankar: భారత ఎన్నికలపై విమర్శలు చేస్తున్న విదేశీ మీడియాకు జైశంకర్ చురకలంటించారు. 200 ఏళ్ల సామ్రాజ్యవాద పోకడను వదులుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు. -
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే
తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
మళ్లీ బెదిరింపు ఈ-మెయిళ్లు
దేశ రాజధాని దిల్లీలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిహాడ్ జైలుకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
దిల్లీ మద్యం కుంభకోణం నిందితుల జాబితాలో ‘ఆప్’!
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరును నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు మంగళవారం దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంతా శర్మకు ఈడీ నివేదించింది. -
ఐటీవో సీఆర్ భవనంలో అగ్నిప్రమాదం
సెంట్రల్ దిల్లీలోని ఐటీవోలో ఆదాయపుపన్ను సెంట్రల్ రెవెన్యూ (సీఆర్) భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తూర్పు దిల్లీకి చెందిన 46 ఏళ్ల ఆదాయపు పన్ను అధికారి ఒకరు దుర్మరణం పాలయ్యారు. -
లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపివేశారా?
ఉత్తరాఖండ్ అధికారులు గత నెలలో లైసెన్సులు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశారా లేదా అని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
రఫాలో భారత మాజీ సైన్యాధికారి మృతి
గాజాలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) తరఫున పనిచేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతి చెందారు. -
‘ఎన్నికల బాండ్లపై దర్యాప్తు’ పిటిషన్లను సత్వరమే విచారించండి
రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చిన ‘ఎన్నికల బాండ్ల’పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనలను సత్వరమే విచారణకు చేపట్టాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల వేళ సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాట్లు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గత 60 రోజుల్లో పాక్ సరిహద్దు వెంబడి 49 డ్రోన్లను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వెల్లడించింది. -
క్యాన్సర్ పునరావృతానికి అడ్డుకట్ట!
చికిత్స తర్వాత క్యాన్సర్ పునరావృతమవుతుంటుంది. దీన్ని అడ్డుకునే సామర్థ్యమున్న మూడు రకాల మందులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
విదేశీయులకు విద్యానంతరం రెండేళ్ల వీసా కొనసాగించాలి
విదేశీ విద్యార్థులకు తమ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యావకాశాలు కల్పించడం, అందుకోసం జారీచేసే గ్రాడ్యుయేట్ వీసాల వల్ల కలిగే లాభనష్టాల గురించి అధ్యయనం చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నియమించిన రివ్యూ కమిటీ కీలక సూచనలు చేసింది. -
ప్రభుత్వ లాంఛనాలతో సుశీల్ మోదీ అంత్యక్రియలు
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం పట్నాలో పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. -
రాగి గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు
రాజస్థాన్లోని నీమ్కా థానా జిల్లాలో రాగి గనుల్లో మంగళవారం ప్రమాదం సంభవించింది. సిబ్బందిని తరలించేందుకు ఉపయోగించే లిఫ్ట్ కుప్పకూలింది. -
ఎల్టీటీఈపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగింపు
శ్రీలంకకు చెందిన ఉగ్ర సంస్థ ఎల్టీటీఈపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మరో ఐదేళ్లు పొడిగించింది. -
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
విట్ వ్యవస్థాపకుడు విశ్వనాథన్కు న్యూయార్క్ వర్సిటీ డాక్టరేట్
తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) వ్యవస్థాపకుడు, ఛాన్స్లర్ అయిన డాక్టర్ జి.విశ్వనాథన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ (ఎస్యూఎన్వై) నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. -
అంబేడ్కర్ పేరును కేజ్రీవాల్ వినియోగించకుండా అడ్డుకోవాలంటూ పిల్
జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను రాజకీయ నాయకులు ఎవరూ స్వప్రయోజనాలకు వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
-
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం