Pappu Yadav: ప్రమాణం చేయకముందే.. చిక్కుల్లో పడ్డ పప్పూ యాదవ్
బిహార్లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పప్పూ యాదవ్పై కేసు నమోదైంది. ప్రమాణం కూడా చేయకముందే ఆయనపై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
పట్నా: బిహార్ (Bihar) ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ (Pappu Yadav) చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆయనపై కేసు నమోదైంది. డబ్బు కోసం చంపేస్తానంటూ ఎంపీ బెదిరించారని ఓ వ్యాపారి పూర్ణియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలో ఓ వ్యక్తి కొన్నేళ్లుగా ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్నాడు. పప్పూ యాదవ్ రూ. కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తాను ఎంపీగా ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటానని.. ప్రశాంతంగా వ్యాపారం చేయాలనుకుంటే అడిగిన మొత్తం ఇవ్వాలన్నారు. లేదంటే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదంతా ఎన్నికల ఫలితాల రోజు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాణ భయంతో వ్యాపారి పప్పూ సహా అతడి వ్యక్తిగత సహాయకుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నాపై కుట్ర జరుగుతోంది..
గతంలోనూ పప్పూ ఇలాగే బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పప్పూ సహా అతడి సహాయకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనపై వచ్చిన ఆరోపణలపై పప్పూ యాదవ్ స్పందించారు. ‘‘ ప్రజలకు నాపై అభిమానం పెరుగుతోంది. దీన్ని సహించలేని వారు కుట్ర పన్నుతున్నారు. పూర్ణియాలో ప్రత్యర్థులు, అధికారులు నాపై చేస్తున్న కుట్రను త్వరలోనే బయటపెడతా. న్యాయస్థానం సమగ్ర విచారణ జరిపి దోషులను ఉరి తీసే రోజు వస్తుంది’’ అని ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా హెచ్చరించారు.
మోదీ క్యాబినెట్లో స్థానం దక్కని వేళ.... శరద్ పవార్కు అజిత్ కృతజ్ఞతలు
ఇదిలా ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో జన్ అధికార్ పార్టీ అధినేత పప్పూ యాదవ్ ఇటీవల కాంగ్రెస్లో చేరారు. అయినా.. ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. తన సమీప ప్రత్యర్థి జేడీ(యూ) అభ్యర్థి సంతోశ్ కుష్వాహాపై 23 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. -
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
తమ సర్వీసుల నిలిపివేసే యోచన వాట్సప్, దాని మాతృసంస్థ మెటాకు లేదని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 5కోట్లకు పైనే: కేంద్రం
దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. -
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొత్త ఇంటికి మారనున్నారు. -
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు
-
ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తే: విజయ్ ఆంటోనీ సమాధానమేంటంటే?
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ