Nitish Kumar: ‘ఇండియా’ కూటమి కథ ఎప్పుడో ముగిసింది: నీతీశ్‌ కుమార్‌

‘ఇండియా’ కూటమి పొత్తుల వ్యవహారం ముగిసి చాలా కాలమైందంటూ జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ విమర్శించారు.

Updated : 17 Feb 2024 16:10 IST

పట్నా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు అంశం ఇంకా ఓ కొలిక్కిరాకపోవడంతో ‘ఇండియా కూటమి’లోని కొన్ని పార్టీలు సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) ఆ కూటమిపై విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు.

‘‘ఇండియా కూటమిలో పొత్తుల వ్యవహారం ముగిసి చాలా కాలమైంది. అసలు ఆ కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టడం నాకు ముందునుంచే ఇష్టం లేదు. వేరే పేరు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించాను. బిహార్‌ ప్రజల అభివృద్ధి కోసం ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నా.  దీనిని కొనసాగిస్తూనే ఉంటా’’ అని పేర్కొన్నారు. ఇదిలాఉండగా, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించగా.. దిల్లీలో కాంగ్రెస్‌కు ఆప్ ఒక్క సీటు మాత్రమే ఆఫర్‌ చేసింది. మరోవైపు ఫరూక్‌ అబ్దుల్లా జమ్మూకశ్మీర్‌లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కాషాయ పార్టీతో జట్టు కట్టే అవకాశాలున్నట్లు ఆర్‌ఎల్‌డీ హింట్‌ ఇచ్చింది.

భాజపాలోకి విపక్ష నేతలు.. ఖర్గే ప్రశ్నకు మోదీ సమాధానమిదే..!

నీతీశ్‌ కోసం ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. ‘ఎవరు ఏం మాట్లాడుతున్నా.. దాని గురించి ఆలోచించవద్దు. పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లే వారి (ఆర్‌జేడీని ఉద్దేశిస్తూ) నుంచి విడిపోయా’’ అని నీతీశ్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని