PM Modi: కశ్మీర్ ట్రిప్ వీడియో షేర్ చేసిన సచిన్.. మోదీ రిప్లై
PM Modi - Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వీడియోపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ మాస్టర్ బ్లాస్టర్ కశ్మీర్ టూర్ను ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) ఇటీవల కుటుంబంతో కలిసి కశ్మీర్ (Kashmir)లో పర్యటించారు. అందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) స్పందించారు. ఈ పర్యటనలో ‘ఉజ్వల భారత్’ గురించి చాటిచెప్పడం అద్భుతమంటూ ప్రశంసించారు.
భార్య అంజలి, కుమార్తె సారా తెందూల్కర్తో కలిసి సచిన్ కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, పర్యటక ప్రాంతాలను సందర్శించారు. పుల్వామా జిల్లాలోని బ్యాట్ తయారీ యూనిట్కు వెళ్లారు. పారా క్రికెటర్ ఇంటికి వెళ్లడం, వీధుల్లో స్థానికులతో కలిసి క్రికెట్ ఆడటంతో పాటు జవాన్లతోను ముచ్చటించారు. తన ట్రిప్ వీడియోను ఆయన బుధవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. తొలిసారి కశ్మీర్ లోయకు మోదీ..!
‘‘కశ్మీర్ పర్యటన నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ అందమైన అనుభవంగా మిగిలిపోతుంది. చుట్టూ మంచుతో కప్పి ఉన్నప్పటికీ.. ఇక్కడి ప్రజల ఆత్మీయ ఆతిథ్యం దాన్ని మైమరపించింది. మన దేశంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని ప్రధాని మోదీజీ అన్నారు. ఈ ట్రిప్ తర్వాత ఆయన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇక, కశ్మీర్ విల్లో బ్యాట్లు.. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్’కు గొప్ప ఉదాహరణ. ఈ బ్యాట్లను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. ఈ పర్యటన తర్వాత నేను చెప్పేది ఒక్కటే.. ‘ఉజ్వల భారత్’ ఆణిముత్యాల్లో ఒకటైన జమ్మూకశ్మీర్కు విచ్చేసి.. ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి’’ అని సచిన్ రాసుకొచ్చారు.
ఈ వీడియోకు ప్రధాని మోదీ స్పందిస్తూ మాస్టర్ బ్లాస్టర్పై ప్రశంసలు కురిపించారు. ‘‘అద్భుతంగా ఉంది. మీ పర్యటన నుంచి యువత రెండు ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలి. 1. ఉజ్వల భారత్లో పలు విభిన్న పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. 2. మేక్ ఇన్ ఇండియా ప్రాముఖ్యత. మనమంతా కలిసి వికసిత, ఆత్మనిర్భర భారత్ను నిర్మిద్దాం..!’’ అని ప్రధాని పోస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్