Syria and Iraq: కరవు కోరల్లో ఇరాక్, సిరియా..పెను సమస్యగా మారనున్న తీవ్ర నీటిఎద్దడి
ఏళ్ల తరబడి అంతర్యుద్ధం, ఉగ్రవాద దాడులు, అస్తవ్యస్త పాలనతో చితికిపోయిన సరిహద్దు దేశాలు
1.2 కోట్ల మందిపై ప్రభావం
హెచ్చరించిన అంతర్జాతీయ సహాయ సంస్థలు
బీరట్: ఏళ్ల తరబడి అంతర్యుద్ధం, ఉగ్రవాద దాడులు, అస్తవ్యస్త పాలనతో చితికిపోయిన సరిహద్దు దేశాలు ఇరాక్, సిరియా ఇప్పుడు తీవ్ర కరవుకాటకాలతో అల్లాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, నానాటికీ పెరిగిపోతున్న భూతాపంతో అక్కడ నీటి ఎద్దడి పెనుసమస్యగా మారబోతోందని, లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడనున్నారని అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నీటి కొరత కారణంగా జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోతున్నాయని, దీనివల్ల విద్యుదుత్పత్తికీ అడ్డంకులు ఏర్పడుతున్నాయని, తద్వారా ఆరోగ్య వ్యవస్థ, అత్యవసర మౌలిక సదుపాయాలపైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉందని వెల్లడించాయి. రెండు దేశాలకూ కీలక జల వనరైన యూఫరేట్స్ నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో తగ్గడంతో రెండు దేశాల్లో కలిపి 1.2 కోట్ల మందిపై ప్రభావం పడిందని పేర్కొన్నాయి. ఇరాక్లోని టిగ్రి నది కూడా దాహార్తి తీర్చలేకపోతోందని చెప్పాయి.
సుమారు 400 కిలోమీటర్ల వ్యవసాయ భూమిపై కరవు ప్రభావం పడిందని తెలిపాయి. ఉత్తర సిరియాలో 30 లక్షల మందికి విద్యుదుత్పత్తి వనరుగా ఉన్న రెండు జలాశయాలను మూసివేసే పరిస్థితులు ఏర్పడబోతున్నాయని హెచ్చరించాయి. ఇరాక్లోని కల్లోల పరిస్థితుల వల్ల లక్షల మంది నిరాశ్రయులు అయ్యారని, సిరియాలోనూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో మంది పారిపోతున్నారని, ఇప్పుడు రాబోతున్న నీటి ఎద్దడి విపత్తు మరింత మందిని నిరాశ్రయులను చేస్తుందని నార్వే శరణార్థి మండలి ప్రాంతీయ డైరెక్టర్ కార్స్టెన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారితో సతమతమవుతున్న ప్రజలపై నీటి ఎద్దడి ముప్పు మరింత ప్రభావం చూపనుందని కేర్ సంస్థ ప్రతినిధి నిర్వానా షాకీ పేర్కొన్నారు. వారిని రక్షించడానికి ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగాలని డానిష్ శరణార్థుల మండలి, యాక్టెడ్, యాక్షన్ అగెనెస్ట్ హంగర్ సంస్థల ప్రతినిధులు సూచించారు. మరోవైపు లెబనాన్లోనూ వచ్చే రోజుల్లో 40 లక్షల మంది తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోబోతున్నారని యూనిసెఫ్ హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు