Arya Rajendran : అమ్మగా లాలిస్తోంది.. మేయర్గా పాలిస్తోంది!
తిరువనంతపురం (Thiruvananthapuram) మేయర్ ఆర్య రాజేంద్రన్ (Arya Rajendran) ఫొటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.
Image : Tamizhachi_Offl
తిరువనంతపురం : ఆర్య రాజేంద్రన్ (Arya Rajendran).. అతి పిన్న వయసులోనే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం (Thiruvananthapuram) మేయర్గా ఎన్నికై యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. 2020లో మేయర్గా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆమె వయసు 21 సంవత్సరాలే. కొన్ని రోజుల తర్వాత ఆర్య రాజేంద్రన్ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సచిన్ దేవ్ను పెళ్లి చేసుకుంది. ఆయన కూడా అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆగస్టు 10వ తేదీన ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. ప్రసవం జరిగి నెల దాటిందో లేదో.. ఆర్య రాజేంద్రన్ తన పాపను ఎత్తుకొని కార్యాలయానికి వెళ్లింది. బుజ్జాయిని ఒడిలో పెట్టుకునే పెండింగ్ దస్త్రాలను పరిశీలించింది. ఆ సమయంలో తీసిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. మాతృత్వపు మాధ్యుర్యాన్ని ఆస్వాదిస్తూనే.. ప్రజలు అప్పగించిన బాధ్యతను ఆమె నెరవేరుస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఆదిత్య ఎల్1 పరిశోధనలు ప్రారంభం.. మరికొన్ని గంటల్లో సూర్యుడి దిశగా ప్రయాణం
వృత్తి, వ్యక్తిగత బాధ్యతలు రెండింటినీ సునాయాసంగా నిర్వహిస్తూ ఎంతో మంది మహిళలకు ఆర్య రాజేంద్రన్ ఆదర్శంగా నిలుస్తోందని పలువురు కొనియాడారు. మహిళలు పని చేసే ప్రదేశాల్లో తప్పకుండా పిల్లలను చూసుకోవడానికి సదుపాయాలు ఉండాలని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఇంట్లోని పిల్లలను తీసుకురాకూడదని గత ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు ప్రస్తావించారు. ఈ ఫొటోకు అభినందనలు మాత్రమే కాదు.. విమర్శలు సైతం వచ్చాయి. ఆర్య రాజేంద్రన్ ఫొటో కోసమే అలా చేశారని ట్రోల్ చేశారు. ఆమె ఉన్నత స్థానంలో కొనసాగుతోంది కాబట్టే ఇది సాధ్యమైందని.. సాధారణ మహిళా ఉద్యోగులు, కార్మికుల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనీవాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. -
డిజిటల్ బాటలో పయనిస్తున్నాం
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు
భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరఫున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అటవీ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు
ఉత్తరాఖండ్లోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలుల కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. -
భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి
గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. -
6.7%కు తగ్గిన నిరుద్యోగిత
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8%గా ఉన్న ఈ రేటు.. 2024 జనవరి-మార్చిలో 6.7%కు పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (6)
వారణాసి లోక్సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసే గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. -
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం మంజూరు షురూ
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి తొలి విడతలో భారత పౌరసత్వం మంజూరు చేసింది.