Nisha Bangre: రాజీనామా ఆమోదించాలంటూ పాదయాత్ర.. మహిళా డిప్యూటీ కలెక్టర్ అరెస్టు!
తన రాజీనామాను ఆమోదించాలంటూ పాదయాత్ర చేపట్టిన ఓ మహిళా డిప్యూటీ కలెక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లో ఇది చోటుచేసుకుంది.
భోపాల్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నానని.. తన రాజీనామాను ఆమోదించి, న్యాయం చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఓ మహిళా డిప్యూటీ కలెక్టర్ పాదయాత్ర చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ర్యాలీగా భోపాల్ (Bhopal)లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేందుకు యత్నించగా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై మార్గమధ్యంలోనే ఆ మహిళా అధికారి (Deputy Collector)ని పోలీసులు అరెస్టు చేశారు.
ఛతర్పుర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా ఉన్న నిశా బాంగ్రే (Nisha Bangre).. ఈ ఏడాది జూన్లో తన రాజీనామాను సమర్పించారు. కానీ, ఇంతవరకూ ప్రభుత్వం అంగీకరించలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తనకు న్యాయం చేయాలని కోరుతూ.. సెప్టెంబర్ 28న ఇక్కడి బేతుల్ జిల్లా నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. సోమవారం సాయంత్రానికి రాజధాని భోపాల్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం వైపు వెళ్లేందుకు యత్నించగా ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. బాంగ్రేను స్థానిక కోర్టులో హాజరుపరిచామని, అయితే, బెయిల్ తీసుకునేందుకు నిరాకరించడంతో.. భోపాల్ కేంద్ర కారాగారానికి తరలించినట్లు చెప్పారు.
పెళ్లి గురించి అందుకే ఆలోచించలేదు..! రాహుల్ గాంధీ
‘ఎస్సీ’ సామాజిక వర్గానికి చెందిన బాంగ్రే.. బేతుల్ జిల్లాలోని తన స్వగ్రామంలో మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు సెలవు మంజూరు చేయకపోవడంతో సర్వీసుకు రాజీనామా చేసినట్లు ఆమె భర్త ఓ వార్తాసంస్థకు తెలిపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. బేతుల్ జిల్లాలోని ఆమ్లా నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని, అయితే జూన్ నుంచి ఆమె రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడం లేదన్నారు. దీంతో చేసేదేమీ లేక శాంతియుత యాత్రను చేపట్టగా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో నవంబర్ 17న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
India-China: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. -
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మ్యానువల్ ఫర్ మామ్స్ టు బి’ పుస్తకంలో బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ అంథోనీ వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. -
ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ చూపించారు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను ఆయన సాధారణ పౌరులకు చూపించారని ఆరోపించారు. -
ఆయనకు 84.. ఆమెకు 66
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చించోలి రహీమాపుర్కు చెందిన విఠల్ ఖండారే (84)కు ఆయన కుమారులు, కుమార్తెలు 66 ఏళ్ల వృద్ధురాలితో ఘనంగా రెండోపెళ్లి జరిపించారు. -
సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. -
4 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తే అథ్లెట్లకు దీర్ఘాయుష్షు
నాలుగు నిమిషాల్లోనే ఒక మైలు దూరం పరుగులు తీసే అథ్లెట్లు.. వారి సాధారణ ఆయుష్షు కన్నా ఐదేళ్లు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. -
వారణాసి గంగా హారతిలో అమిత్ షా, యోగి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్లో జరిగిన గంగా హారతికి హాజరయ్యారు. -
చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. -
ఓ ఆదివాసీ ప్రశ్నకు వ్యంగ్యంగా బదులిచ్చానంతే
రత్లాం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా తాజాగా చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ
సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్) మార్కెట్లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. -
నింగిలో రంగురంగుల అరోరాలు
చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది.
తాజా వార్తలు (Latest News)
-
రెంటచింతలలో వైకాపా నేతల దాడి.. పలువురికి గాయాలు
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు