15Years for Arundhati: ‘అరుంధతి’ మూవీకి సోనూసూద్ పారితోషికం తెలిస్తే షాకే!
Arundhati Movie: అరుంధతి చిత్రంలో పశుపతిగా నటించిన సోనూసూద్ తొలుత ఆ పాత్ర చేయనని చెప్పారు. 20 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని అనుకున్నారు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా జరిగింది.
ఇంటర్నెట్డెస్క్: అనుష్క (Anushka), సోనూసూద్ (Sonu sood) కీలక పాత్రల్లో కోడి రామకృష్ణ తెరకెక్కించిన హారర్ ఫాంటసీ మూవీ ‘అరుంధతి’ (Arundhati). మల్లెమాల ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్యామ్ ప్రసాద్ నిర్మించారు. 2009 జనవరి 16న వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మంగళవారంతో ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చక్కని అభిరుచితో చిత్రాలు నిర్మించే శ్యామ్ ప్రసాద్రెడ్డి కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ఇది. రొటీన్ సినిమాలకు భిన్నంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం అనుష్క కెరీర్ను కూడా మలుపు తిప్పింది. ‘అరుంధతి’ పాత్ర కోసం అనుష్క కంటే ముందు చాలా మంది పేర్లు అనుకున్నారు. కథపరంగా యువరాణి పాత్రలో కనిపించే నటి రాయల్ లుక్ కలిగి ఉండాలని నియమం పెట్టుకోవడం ఎక్కడా రాజీపడకుండా నిర్మాత శ్యామ్ ప్రసాద్రెడ్డి వరుస ఆడిషన్స్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో నిర్మాత జెమినీ కిరణ్ సూచన మేరకు నాగార్జున ‘సూపర్’లో నటించిన అనుష్కను చూసి ఓకే అనుకున్నారు. వెంటనే ఆమెకు ఆ విషయం చెప్పకుండా రకరకాల ఆడిషన్స్, లుక్ టెస్ట్ చేసి చివరకు ఫైనలైజ్ చేశారు.
తొలుత తమిళ నటుడు అనుకుంటే...
‘అరుంధతి’ చిత్రంలో మరో కీలక పాత్రను సోనూసూద్ (Sonu sood) పోషించారు. సినిమాను చూసిన తర్వాత పశుపతిగా ఆయనను తప్ప మరొకరని ఊహించుకోలేం. ఈ పాత్రకు మొదట తమిళ నటుడు పశుపతిని అనుకున్నారు. ఆ పేరు పెట్టడానికి కూడా కారణం అదే. అఘోర పాత్రకు పశుపతి చక్కగా సూట్ అవుతారని చిత్రం బృందం భావించింది. సినిమాలో కొన్ని సీన్లలో పశుపతి పాత్ర రాయల్ లుక్లో కనిపించాలి. దీంతో ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ చిత్రం విడుదలైంది. అందులో విలన్గా నటించిన సోనూసూద్.. నిర్మాత శ్యామ్ ప్రసాద్రెడ్డి దృష్టిని ఆకర్షించారు. అయితే అఘోరా గెటప్ స్కెచ్ చూపించగానే ఆ పాత్రను చెయ్యనని సోనూసూద్ చెప్పారు. ఒకసారి గెటప్ వేసుకోమని, మేకప్ టెస్ట్ చేసిన తర్వాత కూడా నచ్చకపోతే.. మరొక నటుడిని తీసుకుంటానని నచ్చజెప్పారు. అందుకు సోను అయిష్టంగానే అంగీకరించారు.
కమల్ హాసన్ నటించిన ‘దశావతారం’ చిత్రానికి వర్క్ చేసిన రమేశ్ను చెన్నై నుంచి పిలిపించి ఆయనతో సోనూసూద్కు అఘోరా గెటప్ వేయించారు. మేకప్ కోసమే ఆయనకు ఆరు గంటలు పట్టింది. ఆ పాత్ర చేయడం తనకు ఇష్టం లేకపోయినా శ్యామ్ ప్రసాద్రెడ్డి తపన చూసి చివరకు సోనూసూద్ అంగీకరించారు. పశుపతి పాత్రకు సంబంధించి 20 రోజుల్లో ఆయన వర్క్ పూర్తి చేస్తామని శ్యామ్ ప్రసాద్రెడ్డి చెప్పగానే, రూ.18 లక్షలు పారితోషికంగా ఇవ్వమని సోనూసూద్ డిమాండ్ చేశారు. ఆయన మరో ఆప్షన్ కూడా ఇచ్చారు. రూ.20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా పని చేస్తానని చెప్పారు. కానీ, శ్యామ్ ప్రసాద్రెడ్డి ఒప్పుకోలేదు. 20 రోజుల్లోనే అతని వర్క్ పూర్తి చేస్తాననీ, రూ.18 లక్షలే ఇస్తానని చెప్పారు. ఒక వేళ 20 రోజుల్లో వర్క్ పూర్తి కాకపోతే, ఆ తర్వాత ఎన్ని రోజులు ఎక్కువ వర్క్ చేస్తే రోజుకి రూ. 25 వేలు ఇస్తానని శ్యామ్ ప్రసాద్రెడ్డి చెప్పారు. అనుకున్నట్లుగా 20 రోజుల్లో సోనూసూద్ వర్క్ పూర్తి కాలేదు. చివరకు ‘అరుంధతి’ చిత్రం ద్వారా సోనూ సూద్ లభించిన పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.45 లక్షలు.
‘అరుంధతి’ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్క (15Years for Arundhati) ట్వీట్ చేశారు. ‘జేజమ్మ పాత్రతో నేను ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం దక్కించుకున్నా. కోడి రామకృష్ణగారు, శ్యామ్ ప్రసాద్రెడ్డిగారికి నా కృతజ్ఞతలు. భారతీయ సినిమాలో ఇదొక ఎపిక్. మీ ప్రేమకు, సహకారానికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.4000తో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా: నాని
ఓ ఇంటర్వ్యూలో తన మొదటి జీతం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని ‘Nani’ -
ఆ సినిమా సమయంలో విజయ్ని చూసి భయపడ్డా.. రష్మిక
గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండను చూసి నిజంగా భయపడిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు రష్మిక. -
‘ఇంద్ర’ను తెరకెక్కించేందుకు వెనకడుగేశారు కానీ: ఈ బ్లాక్ బస్టర్ మూవీ విశేషాలు తెలుసా?
చిరంజీవి హీరోగా బి. గోపాల్ తెరకెక్కించిన చిత్రం ‘ఇంద్ర’. ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు.. -
‘మల్లీశ్వరి’లో డైనింగ్ టేబుల్ సీన్.. ఆసక్తికర విషయం పంచుకున్న కె.విజయ భాస్కర్
దర్శకుడు కె. విజయ భాస్కర్ ఇంటర్వ్యూలో తాను తీసిన మల్లీశ్వరి సినిమాలో ఆ సన్నివేశాలు ఎప్పటికీ మరచిపోలేనివి అంటూ గుర్తు చేసుకున్నారు. -
ఒకే రోజు .. రెండు సినిమాలు.. ఒకే దర్శకుడు..
ఒకే రోజున ఒక హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలైతే అది వారి అభిమానులకు విశేషమైన పండగే. అలాగే ఒకే హీరోయిన్ రెండు సినిమాల్లో నటించి, ఆ రెండు చిత్రాలు ఒకేరోజున విడుదలైన సందర్భాలు ఉన్నాయి. -
‘ఎవడు వాడు.. మంచి ఛాన్స్ పోగొట్టాడు’
‘పుష్పవిమానం’ మూవీలో కథానాయిక ఎంపికకు సంబంధించి జరిగిన ఆసక్తికర విషయాన్ని సింగీతం శ్రీనివాసరావు ఓ సందర్భంలో పంచుకున్నారిలా.. -
ఆల్టైమ్ క్లాసిక్ ‘ఆదిత్య 369’కు 33 ఏళ్లు.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
ప్రస్తుతం ‘కల్కి’ చూసి భవిష్యత్లో ప్రపంచం ఇలా ఉంటుందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, కొన్నేళ్ల కిందటే ప్రేక్షకుడిని భూత, భవిష్యత్తు కాలాల్లో ప్రయాణించిన అనుభూతి కలిగించిన చిత్రం ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ (జులై 18, 1991) విడుదలై 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. -
‘ఈ పాత్రకు ఎందుకు ఎంపిక చేశారండి’ అన్న వాణీవిశ్వనాథ్.. విడుదల తర్వాత స్టార్డమ్
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ సందర్భంలో వాణీ విశ్వనాథ్ అన్న మాటలు గుర్తు చేసుకున్నారు. -
ట్రైలర్ షేర్ చేసి.. సినిమా ఆఫర్ అందుకుని: ‘మావీరన్’ అలా మొదలైంది
‘మావీరన్’ సినిమా విశేషాలు పంచుకున్నారు హీరో శివకార్తికేయన్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
‘రోబో’లో మైఖేల్ జాక్సన్ పాట.. అలా మిస్సయింది!
‘రోబో’లో మైఖేల్ జాక్సన్తో పాట పాడించాలనుకున్న విషయాన్ని రెహమాన్ తాజాగా పంచుకున్నారు. -
రాజమౌళిని ఇబ్బంది పెట్టిన సుకుమార్ షాట్
సుకుమార్ తీసిన ‘1: నేనొక్కడినే’ మూవీలో ఓ షాట్ గురించి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
‘బాహుబలి’ ఇంటర్వెల్.. ఆ డైలాగ్స్ వెర్షన్తో తెరకెక్కించి ఉంటే!
ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ చిత్రం గురించి పలు ఆసక్తికర విశేషాలివీ.. -
‘భారతీయుడు’ కోసం ఈ తెలుగు హీరోలను అనుకున్నారు కానీ..
కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘భారతీయుడు’ గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
‘ఒక్కడు’ మూవీకి తొలుత అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?
Okkadu movie: మహేశ్బాబు కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ తొలుత వేరే టైటిల్ అనుకున్నారు. -
ఆ అవమానం మరిచిపోలేని అక్కినేని..
నటుడిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆయనకు ఎదురైన అవమానాలనే సోపానాలుగా చేసుకుని విజయం వైపు పయనించారు అక్కినేని -
హోటల్లో వెయిటర్గా నాజర్.. చిరంజీవికి విషయం తెలియడంతో..
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్లో వెయిటర్గా పనిచేశారట సినీ నటుడు నాజర్.. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
‘భారతీయుడు 2’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. ‘రోబో’, ‘2.ఓ’ల్లో తానెందుకు నటించలేదో వివరించారు. -
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
తానెందుకు సినిమాటిక్ యూనివర్స్లో చిత్రాలు తెరకెక్కించలేదన్న ప్రశ్నపై దర్శకుడు శంకర్ స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. -
అరవింద స్వామి మంచంపై.. రజనీ నేలపై..!
దళపతి సినిమా చిత్రీకరణ సందర్భంగా నేలపై పడుకున్న రజనీకాంత్ను చూసి అరవిందస్వామి షాకయ్యారు. -
కమల్ స్థానంలో మోహన్లాల్.. షారుక్ ప్లేస్లో అజయ్ దేవ్గణ్
తాను గతంలో తెరకెక్కించిన ఓ సినిమాకు సంబంధించి దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. అదే సినిమా అంటే? -
ఆయనే ‘వైజయంతీ మూవీస్’ అని పేరు పెట్టారు
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘వైజయంతీ మూవీస్’ అసలు ఎలా ఏర్పాటైందో తెలుసుకుందామా!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు