నటి సంగీత కన్నీటి పర్యంతం..!

‘ఒక్కఛాన్స్‌ ఒకే ఒక్క ఛాన్స్‌’ అంటూ అమాయకపు చూపులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి సంగీత. ‘ఖడ్గం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. పలు తెలుగు చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా ఆమె ఓ ఈవెంట్‌లో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. సంగీతతోపాటు...

Updated : 18 Oct 2020 14:38 IST

ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేస్తున్న వీడియో  

హైదరాబాద్‌: ‘ఒక్కఛాన్స్‌ ఒకే ఒక్క ఛాన్స్‌’ అంటూ అమాయకపు చూపులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి సంగీత. ‘ఖడ్గం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా ఆమె ఓ ఈవెంట్‌లో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. సంగీతతోపాటు అదే ఈవెంట్‌లో పాల్గొన్న పలువురు టాలీవుడ్‌ కమెడియన్ల కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

దసరా పండుగను పురస్కరించుకుని ఈటీవీలో ‘అక్కా ఎవరే అతగాడు?’ అనే పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. ఇందులో భాగంగా సంగీత.. పూజకు వచ్చిన వారిలో మంచి అబ్బాయిలను సెలక్ట్‌ చేసి.. తన ఇద్దరు చెల్లెళ్లకు(రష్మి, వర్షిణి) పెళ్లి చేయాలని భావిస్తుంది. సంగీత ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో శేఖర్‌ మాస్టర్‌, నవదీప్‌, సుధీర్‌ పాల్గొని వారి టాలెంట్స్‌ని బయటపెడతారు.

కాగా, త్వరలో ప్రసారం కానున్న ‘అక్కా ఎవరే అతగాడు?’ ప్రోగ్రామ్‌కి సంబంధించిన సరికొత్త ప్రోమో ఇప్పుడు అందరి మనసులను కదిలిస్తోంది. ఈవెంట్‌లో భాగంగా.. ఒకానొక సమయంలో తెలుగిళ్లలో నవ్వులు పూయించి.. పలు కారణాల వల్ల మృతి చెందిన టాలీవుడ్‌ హాస్యనటుల గురించి పలువురు కమెడియన్లు ఓ స్కిట్‌ చేశారు. అయితే ఈ స్కిట్‌లో భాగంగా.. ‘దసరా ఈవెంట్‌ చాలా బాగా జరిగింది. వచ్చిన పని అయిపోయింది. పైనుంచి పిలుపొచ్చింది. వెళ్లాలి’ అంటూ ఆనాటి హాస్యనటులు భావోద్వేగానికి గురైనట్లు చూపించారు. దీంతో ఈవెంట్‌లో పాల్గొన్న సదరు హాస్యనటుల కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. అదే సమయంలో నటి సంగీత సైతం కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.  త్వరలో ప్రసారం కానున్న ‘అక్కా ఎవరే అతగాడు?’ ఈవెంట్‌కి సంబంధించిన సరికొత్త ప్రోమో చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని