Ramanaidu: రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు.
ఇంటర్నెట్డెస్క్: సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. కథల ఎంపికలో, సినిమా నిర్మాణంలో ఎంత కచ్చితంగా ఉండేవారో.. నటులను, ఇతర సాంకేతిక బృందాన్ని అంతే గౌరవించేవారు. వారికి ముట్ట చెప్పాల్సిన మొత్తాన్ని అణాపైసలతో సహా ఇచ్చేవారు. సినిమా విజయవంతమైతే అదనపు బహుమతులూ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. నటీనటులకు డబ్బు ఇచ్చేటప్పుడు ఎంత ఔదార్యంతో ఉండేవారో దివంగత నటుడు రావి కొండలరావు ఓ సందర్భంలో పంచుకున్నారు.
‘‘రామానాయుడుగారు ‘అగ్నిపూలు’ (1981) సినిమా తీశారు. యద్దనపూడి సులోచనారాణి నవల. ఆ సినిమా అనుకుంటున్నప్పుడు నేను ఎందుకో నాయుడుగారిని కలవడానికి వెళ్తే, ‘అగ్నిపూలు’ నవల ఇచ్చారు. (అలా కొంతమంది రచయితలకి ఇచ్చారట) ‘ఇది చదువు. కథలో కల్పించడానికి బాగుంటుందనుకుంటే ఏదైనా పాయింటు చెప్పు. నీ పాయింటు నాకు నచ్చితే నీకు రెండువేలు ఇస్తాను’ అన్నారు. నేను దానిని చదివి ఆ నవల మొత్తం డైరీ రూపంలో ఉంది. ఏదో నాకు తోచిన చిన్న పాయింట్ని చెప్పాను. ‘బాగుంది. దర్శకుడు, రచయితలతో కూడా చెప్తాను. అనుకున్నట్టుగానే, నీకు రెండు వేలు ఇస్తాను తీసుకో’ అని చెక్కు బుక్కు తియ్యబోయారు. అంతకుముందు నాయుడు గారి ‘జీవిత కథను’ పుస్తకంగా రాయమని నాకు చెప్పి, మూడు వేలు అడ్వాన్సు ఇచ్చారు. అది జరగలేదు. ఎందుకంటే కొన్ని గంటలపాటు ఆయనతో కూర్చుని, ఇంటర్వ్యూ చెయ్యాలి. అదంతా రికార్డ్ చేసుకోవాలి. ఆయన ఎప్పటికప్పుడు ‘ఇదిగో అదిగో’ అంటూ బాగా బిజీగా ఉన్నారు. వారానికి ఒకసారి బొంబాయి వెళ్తున్నారు. ‘రోజుకి రెండు గంటలు కేటాయించండి’ అని అడిగినా కూడా కుదరలేదు. సరే అని, వదిలేశాను’’
‘‘ఆ మూడు వేలూ నా దగ్గర ఉన్నాయి. అందులో మినహాయించుకుందాం’ అన్నాను. ‘అలా ఎందుకులే, అది అలా ఉండనీ చూద్దాం! ఇప్పుడిది తీసుకో’ అని ఇచ్చేశారు. తర్వాత ఒక సినిమాలో వేషం ఇచ్చారు. ‘మీరిచ్చిన మూడు వేలూ అలాగే ఉన్నాయి. ఈ సినిమా పారితోషికంలో కొంత ఇచ్చేసినట్టే’ అని అన్నాను. అప్పుడూ ఆ పాత మాటే అన్నారు. ‘అది అలా ఉండనీ చూద్దాం’ అని. నాకు తెలిసి, పారితోషికం గురించి ఎవరూ రామానాయుడిగారితో మాట్లాడరు. ఆయన ఎంత ఇస్తే అది తీసుకోడమే! అయితే ఆ పారితోషికం చూసినవాళ్లు ‘అరె! బాగా తక్కువ ఇచ్చారే’ అనుకున్నవాళ్లూ ఎవరూ లేరు. తృప్తిగానే ఉంటుంది. హైదరాబాద్ వచ్చాక, ‘మధుమాసం’ సినిమాలో నాయుడుగారు నాకు వేషం ఇచ్చారు. వేషం అయిపోయి, డబ్బింగ్ చెప్పేసిన తర్వాత చెక్కు పంపించారు. తృప్తిగానే ఉంది! నిర్మాతగా నాయుడుగారి వ్యవహారాలు అలా ఉంటాయి.’’ అని రామానాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రావికొండలరావు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.4000తో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా: నాని
ఓ ఇంటర్వ్యూలో తన మొదటి జీతం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని ‘Nani’ -
ఆ సినిమా సమయంలో విజయ్ని చూసి భయపడ్డా.. రష్మిక
గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండను చూసి నిజంగా భయపడిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు రష్మిక. -
‘ఇంద్ర’ను తెరకెక్కించేందుకు వెనకడుగేశారు కానీ: ఈ బ్లాక్ బస్టర్ మూవీ విశేషాలు తెలుసా?
చిరంజీవి హీరోగా బి. గోపాల్ తెరకెక్కించిన చిత్రం ‘ఇంద్ర’. ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు.. -
‘మల్లీశ్వరి’లో డైనింగ్ టేబుల్ సీన్.. ఆసక్తికర విషయం పంచుకున్న కె.విజయ భాస్కర్
దర్శకుడు కె. విజయ భాస్కర్ ఇంటర్వ్యూలో తాను తీసిన మల్లీశ్వరి సినిమాలో ఆ సన్నివేశాలు ఎప్పటికీ మరచిపోలేనివి అంటూ గుర్తు చేసుకున్నారు. -
ఒకే రోజు .. రెండు సినిమాలు.. ఒకే దర్శకుడు..
ఒకే రోజున ఒక హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలైతే అది వారి అభిమానులకు విశేషమైన పండగే. అలాగే ఒకే హీరోయిన్ రెండు సినిమాల్లో నటించి, ఆ రెండు చిత్రాలు ఒకేరోజున విడుదలైన సందర్భాలు ఉన్నాయి. -
‘ఎవడు వాడు.. మంచి ఛాన్స్ పోగొట్టాడు’
‘పుష్పవిమానం’ మూవీలో కథానాయిక ఎంపికకు సంబంధించి జరిగిన ఆసక్తికర విషయాన్ని సింగీతం శ్రీనివాసరావు ఓ సందర్భంలో పంచుకున్నారిలా.. -
ఆల్టైమ్ క్లాసిక్ ‘ఆదిత్య 369’కు 33 ఏళ్లు.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
ప్రస్తుతం ‘కల్కి’ చూసి భవిష్యత్లో ప్రపంచం ఇలా ఉంటుందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, కొన్నేళ్ల కిందటే ప్రేక్షకుడిని భూత, భవిష్యత్తు కాలాల్లో ప్రయాణించిన అనుభూతి కలిగించిన చిత్రం ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ (జులై 18, 1991) విడుదలై 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. -
‘ఈ పాత్రకు ఎందుకు ఎంపిక చేశారండి’ అన్న వాణీవిశ్వనాథ్.. విడుదల తర్వాత స్టార్డమ్
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ సందర్భంలో వాణీ విశ్వనాథ్ అన్న మాటలు గుర్తు చేసుకున్నారు. -
ట్రైలర్ షేర్ చేసి.. సినిమా ఆఫర్ అందుకుని: ‘మావీరన్’ అలా మొదలైంది
‘మావీరన్’ సినిమా విశేషాలు పంచుకున్నారు హీరో శివకార్తికేయన్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
‘రోబో’లో మైఖేల్ జాక్సన్ పాట.. అలా మిస్సయింది!
‘రోబో’లో మైఖేల్ జాక్సన్తో పాట పాడించాలనుకున్న విషయాన్ని రెహమాన్ తాజాగా పంచుకున్నారు. -
రాజమౌళిని ఇబ్బంది పెట్టిన సుకుమార్ షాట్
సుకుమార్ తీసిన ‘1: నేనొక్కడినే’ మూవీలో ఓ షాట్ గురించి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
‘బాహుబలి’ ఇంటర్వెల్.. ఆ డైలాగ్స్ వెర్షన్తో తెరకెక్కించి ఉంటే!
ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ చిత్రం గురించి పలు ఆసక్తికర విశేషాలివీ.. -
‘భారతీయుడు’ కోసం ఈ తెలుగు హీరోలను అనుకున్నారు కానీ..
కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘భారతీయుడు’ గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
‘ఒక్కడు’ మూవీకి తొలుత అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?
Okkadu movie: మహేశ్బాబు కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ తొలుత వేరే టైటిల్ అనుకున్నారు. -
ఆ అవమానం మరిచిపోలేని అక్కినేని..
నటుడిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆయనకు ఎదురైన అవమానాలనే సోపానాలుగా చేసుకుని విజయం వైపు పయనించారు అక్కినేని -
హోటల్లో వెయిటర్గా నాజర్.. చిరంజీవికి విషయం తెలియడంతో..
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్లో వెయిటర్గా పనిచేశారట సినీ నటుడు నాజర్.. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
‘భారతీయుడు 2’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. ‘రోబో’, ‘2.ఓ’ల్లో తానెందుకు నటించలేదో వివరించారు. -
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
తానెందుకు సినిమాటిక్ యూనివర్స్లో చిత్రాలు తెరకెక్కించలేదన్న ప్రశ్నపై దర్శకుడు శంకర్ స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. -
అరవింద స్వామి మంచంపై.. రజనీ నేలపై..!
దళపతి సినిమా చిత్రీకరణ సందర్భంగా నేలపై పడుకున్న రజనీకాంత్ను చూసి అరవిందస్వామి షాకయ్యారు. -
కమల్ స్థానంలో మోహన్లాల్.. షారుక్ ప్లేస్లో అజయ్ దేవ్గణ్
తాను గతంలో తెరకెక్కించిన ఓ సినిమాకు సంబంధించి దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. అదే సినిమా అంటే? -
ఆయనే ‘వైజయంతీ మూవీస్’ అని పేరు పెట్టారు
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘వైజయంతీ మూవీస్’ అసలు ఎలా ఏర్పాటైందో తెలుసుకుందామా!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం