Anjali: పెళ్లి చేసుకుంటానన్నా ఇంట్లోవాళ్లు నమ్మేలా లేరు!
ఇటీవలే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో 50చిత్రాల మైలురాయిని దాటింది అంజలి. ఇప్పుడు విష్వక్ సేన్తో కలిసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఇటీవలే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో 50చిత్రాల మైలురాయిని దాటింది అంజలి. ఇప్పుడు విష్వక్ సేన్తో కలిసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాని కృష్ణచైతన్య తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 31న రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది అంజలి.
ట్రైలర్లో మీరు కనిపించిన తీరు.. పలికిన సంభాషణలు చూస్తుంటే ఈ సినిమాలో చాలా మాస్ పాత్ర చేశారనిపిస్తోంది?
‘‘ఈ తరహా పాత్ర చేయడం నాకు కూడా కొత్తగానే అనిపించింది. నేనిలాంటి పాత్రలో కనిపించడం.. ఈ తరహా బోల్డ్ సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే తొలిసారి. మొదటిసారి ఆ డైలాగ్లు విన్నప్పుడు నిజంగా వీటిని సినిమాలో ఉంచుతారా అనుకున్నా. ఇలాంటి పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మనకు తారసపడుతూనే ఉంటాయి’’.
ఈ సినిమా చేయడానికి దీంట్లో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేంటి?
‘‘నాకెప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషించడం నచ్చదు. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచాలనుకుంటా. ఈ సినిమాలోని నా రత్నమాల పాత్రలో ఆ వైవిధ్యత కనిపించింది. ఆ పాత్రను మలచిన తీరు చాలా బాగుంటుంది. కృష్ణచైతన్య నాకు తొలిసారి కథ వినిపించినప్పుడు ఇలాంటి పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణమేంటని అడిగా. ఎందుకంటే నన్ను ఎక్కువగా అందరూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో చూడాలనుకుంటారు. కానీ, ఈ పాత్ర దానికి పూర్తి భిన్నంగా.. చాలా మాస్గా ఉంటుంది. చైతన్య మాత్రం ఈ పాత్రకు నేనైతేనే న్యాయం చేయగలనని నమ్మి నా దగ్గరకొచ్చినట్లు చెప్పారు. తను నిజంగా ఏ నమ్మకంతో చెప్పారో తెలియదు కానీ.. ఇంత మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది’’.
ఈ చిత్రంలో విష్వక్ పాత్రతో మీ ప్రయాణం ఎలా ఉండనుంది? ఈ చిత్ర విషయంలో సవాల్గా అనిపించిన అంశాలేంటి?
‘‘ఇందులో మా ఇద్దరి పాత్రల బంధం చాలా స్వీట్గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. నేను రత్నమాలైతే.. తను రత్నాకర్. ఇద్దర్నీ రత్న అనే పిలుస్తారు. అంతేకాదు సినిమాలో మా పాత్రలు రెండూ పోటాపోటీగానే అనిపిస్తాయి. ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో చూసిన సీత స్వీట్గా కాకుండా మాస్గా కొంచెం రఫ్గా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీంట్లో నా పాత్ర’’.
మీ పెళ్లి విషయమై తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. దానిపై మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
‘‘సోషల్ మీడియా నాకు ఇప్పటికే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేసింది (నవ్వుతూ). మొదట్లో ఇలాంటి గాసిప్స్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లు కంగారు పడేవాళ్లు. కానీ, ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. నా పెళ్లిపై ఇప్పటి వరకు వచ్చిన గాసిప్స్ వల్ల నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ‘ఇతన్నే పెళ్లి చేసుకుంటాన’ని చెప్పినా ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నేను సినిమాలతో బిజీగా ఉన్నా. తప్పకుండా నేను పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తా’’.
ఈ మధ్య కథానాయిక పాత్రలు కాకుండా ఎక్కువగా కీలక పాత్రలు పోషించడానికి కారణమేంటి?
‘‘అలా ఏమీ లేదు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నాది కీలక పాత్ర కాదు. కథానాయికలలో ఒక పాత్ర. ‘గేమ్ ఛేంజర్’లోనూ నా పాత్ర అలాగే ఉంటుంది. కియారాతో పాటు నేనూ మరో నాయికగానే కనిపిస్తా. రామ్చరణ్కు ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో నేను జోడీగా కనిపిస్తా. దాంట్లో మా ఇద్దరికీ మంచి పాట కూడా ఉంది. నా తదుపరి సినిమాల్లోనూ నేను ప్రధాన పాత్ర చేస్తున్నవే ఉన్నాయి’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల