Amritha aiyer: ‘హను-మాన్’ గుర్తుండిపోయే జ్ఞాపకం
‘రెడ్’, ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా?’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక అమృత అయ్యర్. ఇప్పుడు ‘హనుమాన్’లో తేజ సజ్జాకు జోడీగా నటించింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించింది అమృత.
‘రెడ్’, ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా?’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక అమృత అయ్యర్. ఇప్పుడు ‘హనుమాన్’లో తేజ సజ్జాకు జోడీగా నటించింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించింది అమృత.
- ‘‘హను-మాన్’ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. వెంటనే చేస్తానని చెప్పేశా. అయితే ఓ చిన్న తెలుగు సినిమాలా మొదలైన ఇది.. ఇంత పెద్ద చిత్రంగా మారుతుందనైతే అసలు అనుకోలేదు. నిన్న ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూస్తుంటే వాళ్ల అరుపులు, కేకలు విని చాలా ఆనందంగా అనిపించింది. అందరికీ నా పాత్ర కూడా బాగా నచ్చింది. కొంతమంది ‘‘ప్రథమార్ధంలో నువ్వే హీరో’ అంటుంటే సంతోషంగా అనిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉందని నాకూ తెలియదు. తెరపై అందరితో కలిసి చూసినప్పుడు సర్ప్రైజ్గా అనిపించింది’’.
- ‘‘హను-మాన్’కు ముందు వరకు నాకు సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఎవరికైనా ఓ హిట్టు పడ్డాకే కదా వారిపై దృష్టి పడేది. ఇప్పుడీ చిత్రం తర్వాత నుంచి మంచి అవకాశాలు వస్తాయనే అనుకుంటున్నా. నాకు నటనా ప్రాధాన్య పాత్రలంటే ఇష్టం. అలాగే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. అలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి సిద్ధమే. నేను సెట్లో ఉంటే ఫోన్ చూడను.. క్యారవాన్లోకి వెళ్లను. అందర్నీ పరిశీలిస్తుంటా. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదోక విషయం ఉంటుంది. తమిళ హీరో విజయ్ను చూసి దీన్ని అలవర్చుకున్నా. ప్రస్తుతం తెలుగులో అల్లరి నరేశ్తో ఓ సినిమా చేస్తున్నా’’.
- ‘‘విడుదలకు ముందు ఈ సినిమాకి థియేటర్ల సమస్య ఏర్పడటంతో టీమ్తో పాటు నాకు కాస్త ఆందోళనగా అనిపించింది. కాకపోతే నాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వ ప్రతిభపై నమ్మకం. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మా. ఈరోజు అదే నిజమైంది. ఇక తేజతో కలిసి పని చేయడం చాలా బాగుంది. తను చాలా మంచి నటుడు. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్, వెన్నెల కిషోర్.. ఇలా ప్రతి ఒక్కరి నుంచి కొన్ని మెళకువలు నేర్చుకున్నా.ఈ ‘‘హను-మాన్’ ప్రయాణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి జ్ఞాపకం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం.. -
ఆ సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగాను: రిచా చద్దా
‘హీరామండి’లో ఒక సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగినట్లు రిచా చద్దా తెలిపారు. -
‘డబుల్ ఇస్మార్ట్’.. డబుల్ ఇంపాక్ట్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించి చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి: కృతి సనన్
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కృతి సనన్ వివరించారు. -
‘కల్కి’ సీజీ వర్క్పై నిర్మాత ఫన్నీ పోస్ట్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే!
‘కల్కి’ సీజీ వర్క్పై నిర్మాత ఫన్నీ పోస్ట్ పెట్టారు. -
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్ సందర్భంగా రాజమౌళి ప్రత్యేక సందేశమిచ్చారు. -
అందుకే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేయలేనన్నారు.. కానీ!
పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంగతులు మీకోసం.. -
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
కథానాయకుడు రామ్ త్వరలో ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కానీ, దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. -
పూజ సరికొత్త ప్రయాణం..
దక్షిణాదితోపాటు.. ఇటు బాలీవుడ్లోనూ ఇప్పటికే తానెంటో నిరూపించుకుంది కథానాయిక పూజా హెగ్డే. గతేడాది ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంతోనే సరిపెట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి వరుస సినిమాలతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. -
తెరపైనా ఫిల్మ్ స్టారే!
‘ఖో గయే హమ్ కహా’తో గతేడాదికి మంచి ముగింపే పలికింది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. ఈ ఏడాది ‘కంట్రోల్’, ‘శంకర’ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె మరో చిత్రంలో కీలక పాత్రలో మెరవనుంది. -
ఇద్దరు నాయికలతో..!
వెంకటేశ్ కొత్త చిత్రం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా... సంగీతం పనులూ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. జులైలో సినిమాని పట్టాలెక్కించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ప్రచారంలో ఉంది. -
తలపడితే వదలడే.. తన పేరు విజయుడే
‘రాయన్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు కథానాయకుడు ధనుష్. ఇది ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది. -
‘డార్లింగ్’ పూర్తయింది
‘డార్లింగ్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించనుంది నభా నటేష్. ఆమె.. ప్రియదర్శి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. -
మనోహరం... రామనామం
ప్రతి పౌరుడూ రాముడిలా బతకాలని...ధర్మబద్ధంగా మెలగాలని చెప్పే కథతోనే ‘రామ జన్మభూమి’ చిత్రాన్ని తెరకెక్కించినట్టు వి.సముద్ర తెలిపారు. ఆయన దర్శకనిర్మాతగా...జై సిద్ధార్థ్, శ్రీరాధా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. -
కేన్స్ చిత్రోత్సవంలో ‘భారత్ పర్వ్’ వేడుక
ఎన్నో ప్రఖ్యాత వేదికలపై ఇప్పటికే మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పింది సినిమా రంగం. ఇప్పుడు తొలిసారి భారతదేశం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పర్వ్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదలైంది
అజిత్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. శుక్రవారం నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభించుకుంది. -
కాండ్రకోట రహస్యం
వరుణ్సందేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..