Bigg Boss Telugu7: నన్ను బయటకు పంపండి.. ప్రశాంత్‌కు కప్పు ఇవ్వండి..!

Published : 04 Dec 2023 16:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 (bigg boss telugu 7) చివరి వారాలకు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్‌లో కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు. టాప్‌-5లో ఎవరు నిలుస్తారా? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియ వాడీవేడీగా సాగింది. పల్లవి ప్రశాంత్‌, అమర్‌ల మధ్య తీవ్ర చర్చ జరిగింది. ‘నన్ను రా అనొద్దు’ అంటూ అమర్‌ను ప్రశాంత్‌ హెచ్చరించగా, ‘నా తమ్ముడిని రా అనే అంటాను. పలకాలనుకుంటే పలుకు.. లేకపోతే లేదు’ అని అమర్‌ అన్నాడు. అర్జున్‌ కూడా అమర్‌ను నామినేట్‌ చేస్తూ ‘మొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నా’ అంటూ ఏదో వివరణ ఇవ్వబోయాడు. ఇక అర్జున్‌, యావర్‌ల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. చివరిగా ‘నన్ను బయటకు పంపండి. ప్రశాంత్‌కు కప్పు ఇచ్చి, మీరు సంతోషంగా ఉండండి’ అంటూ అమర్ చెప్పుకొచ్చాడు.

అంతకుముందు విడుదల చేసిన ప్రోమోలో శివాజీ, శోభాశెట్టిల మధ్య కూడా తీవ్ర చర్చ జరిగింది. ‘ఎక్కడో ఒక చోట ఆట వదిలేసుకున్నారేమో అనిపించింది’ అని ఫినాలే  టాస్క్‌ల రేసులో శివాజీని ఉద్దేశించి అనగా, ‘అలా ఎందుకు చేస్తాను. తెలిసి ఎందుకు చేస్తాను. రేసులో ఉండాలనే అనుకుంటాను. అమర్ ఫౌల్ గేమ్ ఆడాడని అందరికీ చూపించాం. అది నీకు తప్పుగా అనిపించలేదా? దాని మీద నామినేషన్ వేయాలని అనిపించలేదా?’ అని కౌంటర్‌ ఇచ్చాడు శివాజీ. ‘దాని గురించి నేను నామినేషన్ చేయాలని అనుకోలేదు’ అంటూ శోభా చెప్పగా, ‘నువ్వేమైనా ఒలింపిక్ పెర్ఫామెన్స్‌ ఇచ్చి నన్ను డామినేట్ చేసుంటే కచ్చితంగా నేను నీ నామినేషన్‌ను యాక్సెప్ట్ చేసేవాడిని’ అని శివాజీ గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమోలు వైరల్‌ అవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని