Diljit Dosanjh: అందుకే అమితాబ్ షోలో పాల్గొన్నా : బెదిరింపుల వేళ దిల్జీత్‌ దోసాంజ్‌ స్పందన

Eenadu icon
By Entertainment Team Published : 01 Nov 2025 13:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని రోజులుగా ప్రముఖ గాయకుడు దిల్జీత్‌ దోసాంజ్‌ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోలో అమితాబ్‌ బచ్చన్‌ పాదాలకు నమస్కరించడంతో ఆయనకు బెదిరింపులు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దిల్జీత్‌ (Diljit Dosanjh) దీనిపై స్పందించారు. తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ షోకు వెళ్లలేదని పంజాబ్ ప్రజల కోసమే వెళ్లినట్లు చెప్పారు.

‘‘నేను సినిమా ప్రచారం కోసమో.. లేదంటే నా పాట ప్రమోషన్‌లో భాగంగానో ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. పంజాబ్‌ వరదల గురించి మాట్లాడడానికి వెళ్లాను. వరదల గురించి ఆ షోలో మాట్లాడితే బాధితులకు విరాళం ఇవ్వడానికి జాతీయస్థాయిలో ప్రజలు ముందుకొస్తారని వెళ్లాను’’ అని దిల్జీత్‌ చెప్పారు. 

అమితాబ్‌ (Amitabh Bachchan) కాళ్లకు దిల్జీత్‌ నమస్కరించడంపై ఖలిస్థానీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. నవంబర్‌ 1న జరగనున్న సిక్కుల స్మారక దినోత్సవం రోజున దిల్జీత్‌ (Diljit Dosanjh) ప్రదర్శనను అడ్డుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమితాబ్‌కు కూడా బెదిరింపులు వచ్చే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు