Cinema News: వెండితెరపై ఉత్తరాంధ్ర జాతర
ఓ కథకు మట్టి పరిమళాలు అద్ది.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచివ్వడంలో ప్రాంతాల పాత్ర కూడా కీలకమే. ఎందుకంటే తెలుగు భాష ఒక్కటే అయినా ప్రాంతాన్ని బట్టి అది కొత్త యాసతో సరికొత్త సొగసులద్దుకొని భిన్నమైన రుచుల్ని పంచుతుంది.
ముస్తాబవుతోన్న తారల చిత్రాలు
ఓ కథకు మట్టి పరిమళాలు అద్ది.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచివ్వడంలో ప్రాంతాల పాత్ర కూడా కీలకమే. ఎందుకంటే తెలుగు భాష ఒక్కటే అయినా ప్రాంతాన్ని బట్టి అది కొత్త యాసతో సరికొత్త సొగసులద్దుకొని భిన్నమైన రుచుల్ని పంచుతుంది. అందుకే కథలు సిద్ధం చేసుకునే సమయంలోనే దాన్ని ఏ ప్రాంత నేపథ్యం నుంచి చెప్పాలన్న విషయంలో ఓ అంచనాకి వచ్చేస్తుంటారు దర్శకులు. ఇప్పుడిలా సిద్ధమైన వాటిలో ఉత్తరాంధ్ర నేపథ్యంతో ముడిపడి ఉన్న స్టార్ల చిత్రాలు కొన్ని సినీప్రియుల్ని ఊరిస్తున్నాయి.
తెలుగు తెరపై ఒక్కో ఏడాది ఒక్కో ప్రాంత నేపథ్య చిత్రాల సందడి బాగా కనిపిస్తుంటుంది. ఒకప్పుడు రాయలసీమ నేపథ్యంగా సాగే యాక్షన్ సినిమాలు జోరు చూపించాయి. ఆ తర్వాత తెలంగాణ నేపథ్య కథల ఊపు కనిపించింది. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్ర కథల వంతొచ్చింది. ప్రస్తుతం రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే కథాంశంతోనే తెరకెక్కనుంది. ఓ ఆటను ప్రధానంగా చేసుకొని బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమాగా దీన్ని ముస్తాబు చేయనున్నారు. ఇప్పుడీ చిత్రం కోసం ఉత్తరాంధ్ర యాసను అనర్గళంగా మాట్లాడగల కొత్త నటీనటుల్ని వెతికి పట్టుకునే పనిలో పడింది చిత్ర బృందం. ఈ యాస కోసం చరణ్ కూడా ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన లుక్ కూడా చాలా రా రస్టిక్గా ఉండనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేసవిలోనే చిత్రీకరణ మొదలు కానుంది.
తీరం తాకిన ప్రేమకథ..
నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ఇది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా ఉండనుంది. పాకిస్థాన్ తీర రక్షక దళానికి అనుకోకుండా పట్టుబడిన ఓ మత్స్యకారుడి జీవిత ఇతివృతమే ఈ సినిమా. చైతన్య దీంట్లో రాజు అనే పాత్రలో కనిపించనుండగా.. ఆయన్ని ప్రేమించే పల్లెటూరి అమ్మాయిగా బుజ్జితల్లి పాత్రలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ చిత్రంలో వీళ్లిద్దరూ ఉత్తరాంధ్ర యాసలో సంభాషణలు పలకనున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం చైతూ పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో మునుపెన్నడూ చూడని రగ్గడ్ లుక్లోకి మారారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా..
హీరో వరుణ్ తేజ్.. దర్శకుడు కరుణ కుమార్ కలయికలో ‘మట్కా’ అనే పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే సాగనుంది. యావత్ దేశాన్ని కదిలించిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 1958-80ల మధ్య కాలంలో సాగే ఈ కథలో వరుణ్ నాలుగు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనుష్క సినిమా.. అదే నేపథ్యం?
గతేడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో ప్రేక్షకుల్ని అలరించింది అనుష్క. ఇప్పుడామె క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ‘వేదం’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. తనకు జరిగిన అన్యాయంపై ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసిందన్నదే దీని ప్రధాన ఇతివృత్తంగా ఉండనున్నట్లు తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల