prashanth varma: రణ్‌వీర్‌తో త్వరలోనే..

హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్‌వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్‌’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు.

Updated : 29 Apr 2024 09:35 IST

హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్‌వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్‌’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. రానున్న ఇరవయ్యేళ్లూ ఈ ప్రపంచం చుట్టూ సినిమాల్ని తెరకెక్కించాలనేది ఆయన ప్రణాళిక. ఇందులో భాగంగానే త్వరలోనే ఆయన బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో జట్టు కట్టనున్నారు. ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా సినిమా దాదాపు ఖాయమైనట్టే. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ కలయికలో సినిమాకి రంగం సిద్ధం చేసింది. త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. దీని తర్వాత ‘హను-మాన్‌’కి కొనసాగింపు ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని