Trisha: ముగిసిన త్రిష ఐడెంటిటీ

గతేడాది ‘లియో’తో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక త్రిష. పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ భామ.. ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది.

Updated : 14 May 2024 09:43 IST

తేడాది ‘లియో’తో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక త్రిష. పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ భామ.. ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఆమె, టోవినో థామస్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఐడెంటిటీ’. అఖిల్‌ పాల్‌, అనాస్‌ఖాన్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో త్రిష తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోల్ని పంచుకుంది చిత్రబృందం. ‘‘ఐడెంటిటీ’లో త్రిష పాత్ర చిత్రీకరణ ముగిసింది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆమె మా ప్రాజెక్టులో భాగమయినందుకు సంతోషంగా ఉంది. మా మీద నమ్మకం ఉంచి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు’’ అని వ్యాఖ్యల్ని జోడించింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగులో ‘విశ్వంభర’, ‘థగ్‌ లైఫ్‌’ ‘విదాముయార్చి’ తదితర చిత్రాలతో బిజీగా ఉంది త్రిష.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని