Trisha: ముగిసిన త్రిష ఐడెంటిటీ
గతేడాది ‘లియో’తో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక త్రిష. పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ భామ.. ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది.
గతేడాది ‘లియో’తో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక త్రిష. పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ భామ.. ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఆమె, టోవినో థామస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్ఖాన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో త్రిష తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోల్ని పంచుకుంది చిత్రబృందం. ‘‘ఐడెంటిటీ’లో త్రిష పాత్ర చిత్రీకరణ ముగిసింది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆమె మా ప్రాజెక్టులో భాగమయినందుకు సంతోషంగా ఉంది. మా మీద నమ్మకం ఉంచి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు’’ అని వ్యాఖ్యల్ని జోడించింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగులో ‘విశ్వంభర’, ‘థగ్ లైఫ్’ ‘విదాముయార్చి’ తదితర చిత్రాలతో బిజీగా ఉంది త్రిష.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడివాళ్లు ఇక్కడ ఇక్కడివాళ్లు అక్కడ
పాన్ ఇండియా జమానా ఇది. భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఇది తెలుగు సినిమా, వీళ్లు హిందీ నటులు అని వేరు చేసి చూడలేం. -
వస్తోంది.. సత్యభామ
కాజల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘సత్యభామ’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఇదొక పాత్రే తప్ప... హీరో అనుకోలేదు!
‘‘టెలివిజన్ నాకు పేరు తీసుకొచ్చింది. ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇచ్చింది. అయితే టెలివిజన్కే ఎక్కువ సమయం కేటాయిచండంతో సినిమాలతో వస్తున్న మంచి పాత్రల్ని దూరం చేసుకుంటున్న అభిప్రాయం కలిగింది. -
నయనతార కొత్త చిత్రం?
ఎలాంటి పాత్రలోనైనా తన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంటుంది అందాల తార నయనతార. -
200 గుర్రాలతో భారీ యాక్షన్
హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘వెల్కమ్ టు ది జంగిల్’ ఒకటి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. -
జీవితంలోని గొప్ప క్షణాలివి..
అనుకోకుండా చిత్రపరిశ్రమకు వచ్చానని చెప్తూ.. ఇప్పుడు హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది బాలీవుడ్ కథానాయిక కృతిసనన్. -
దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్
తెలుగు తెరపై ఇప్పటి వరకు ఎంతో మంది కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారి వారి ప్రతిభను నిరూపించుకున్నారు. -
ఐశ్వర్య హొయలు.. ఫరియా నవ్వులు.. అనన్య సెల్ఫీ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కలలు కనడం మానొద్దు: నాగ్ అశ్విన్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కొనియాడారు.