k viswanath:‘అబ్బే ఆడదండీ’ అన్నవారంతా అవాక్కయ్యారు!
అపురూప దృశ్యకావ్యం ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే దర్శకుడు కె.విశ్వనాథ్ శివైక్యం కావడం అందరినీ కలిచివేస్తోంది. అప్పట్లో ఆ సినిమా విడుదల చేద్దామంటే కొనేవారే కరవైన దగ్గరి నుంచి జాతీయ అవార్డు అందుకునే వరకూ ఏం జరిగిందో తెలుసా..?
ఇంటర్నెట్డెస్క్: తెలుగు సినీ చరిత్రలో ‘శంకరాభరణం’ (sankarabharanam)ఒక ఆణిముత్యం. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా, ఎన్ని పేరాలు రాసినా తనివి తీరదు. అప్పట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య సినిమాలపై చర్చ వస్తే, ఎదుటి వ్యక్తికి ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘శంకరాభరణం ఎన్నిసార్లు చూశారు?’. అప్పట్లో ఈ సినిమా ఎన్నిసార్లు చూస్తే అంతగొప్ప. ఇక అవార్డు, రివార్డులు ‘శంకరశాస్త్రి’ పాదాక్రాంతమయ్యాయి. అలాంటి గొప్ప చిత్రాన్ని మనకు అందించి ఆ సినిమా విడుదలైన రోజే దర్శకుడు కె.విశ్వనాథ్ శివైక్యం కావడం అందరినీ కలిచివేస్తోంది. ‘శంకరాభరణం’ విడుదల చేద్దామంటే కొనేవారే కరవైన దగ్గరి నుంచి జాతీయ అవార్డు అందుకునే వరకూ ఏం జరిగిందో తెలుసా..?
‘శంరాభరణం’లాంటి కథతో సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శకుడు విశ్వనాథ్(k viswanath) మదిలో మెదిలిన ఆలోచన ఒక కొత్త వ్యక్తిని పెట్టి ఈ కథతో తీయాలనుకున్నారు. ఆ సమయంలో ‘రారా కృష్ణయ్య’లో నటించిన జొన్నలగడ్డ వెంకట సోమయాజులుని శంకరశాస్త్రి పాత్ర కోసం తీసుకున్నారు. అలాగే మంజు భార్గవి కూడా అప్పటికి పెద్ద పేరున్న నటేమీ కాదు. ఇక షూటింగ్కు వెళ్లాక ప్రతి షాటునీ శ్రమతో, ప్రతి దృశ్యాన్ని శ్రద్ధతో తీశారు. మొదటి కాపీ వచ్చిన తర్వాత దగ్గర వాళ్లంతా చూసి విశ్వనాథ్కి జేజేలు పలికారు.
ఇక ఆ సినిమా ప్రజల దగ్గరకు వెళ్లాలి. ఆ రోజుల్లో పంపిణీదారులు లేరు. కొనుగోలు దారులే దారి. అప్పట్లో ఆ హీరోల సినిమాలకు జిల్లాల వారీగా కొన్ని ధరలుండేవి. నిర్మాత, కొనుగోలుదారు చేరుతాడనుకొని వ్యాపారం చేసేవారు. ‘శంకరాభరణం’ కొనుగోలుదారుల ముందుకు వెళ్లింది. ‘నడిగర్ సంఘం’ ఆవరణలోని థియేటర్ బుక్ చేసి సినిమా వేశారు. కొందరు మిత్రులు, పరిశ్రమలోని ముఖ్యమైన వాళ్లూ వచ్చారు. సినిమా పూర్తయింది. ‘బాగుందండీ’ అన్నవాళ్లేగానీ, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా వ్యాఖ్యానాలు. ‘మంజుభార్గవికి పేరు లేదు. జయమాలినిని పెట్టి ఉంటే బాగుండేది’ అని ఒకరు. ‘కొత్తవాడు కాకుండా అక్కినేని నాగేశ్వరరావుని పెట్టి తీసి ఉంటే ఆయన కోసం కొనేవాళ్లం’ అని ఒకరు ‘జనం చూడరండీ పాటలు, డ్యాన్సులు ఎవడిక్కావాలి? అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నా చేతులు కాల్చుకోలేను’ ఇంకొకరు. ఇలా విమర్శలు చేశారు. కానీ, ఎంతో కొంతకి కొంటామన్నవాళ్లు లేరు.
నిర్మాత ఏడిద నాగేశ్వరరావు డీలా పడిపోయారు. విశ్వనాథ్ నిరాశ పడినా జనంలోకి వెళ్తే ఆదరణ లభిస్తుందని నమ్మకం. కానీ వెళ్లడం ఎలా? కనీసం పారితోషికం కూడా తీసుకోలేదు. సినిమా విడుదలై బాగా నడిస్తే వచ్చిన దానిలో లాభం తీసుకుందామనుకున్నారు. అలాగే ఒప్పందం చేసుకున్నారు. ప్రయత్నాలు చేసి చేసి ఏడిద నాగేశ్వరరావు ఎంతకో కొంతకి, నష్టానికే కొన్ని జిల్లాలకు అమ్మేశారు. కొన్ని జిల్లాలు అమ్ముడు పోలేదు. సినిమా విడుదలైంది. సినిమా భాషలో చెప్పాలంటే ఓపెనింగ్స్ లేవు. మూడో రోజు, నాలుగో రోజు థియేటర్లు వెలవెల బోయాయి. ‘బాగుంది’ అన్న మాట మాత్రం వినిపిస్తోంది. నిదానంగా ‘బాగుంది.. బాగుంది’ అన్న మాటే ప్రచార సాధనమై రెండో వారం నుంచి అందుకుంది.
ప్రేక్షకులు ఆనంద పరవశులైపోయారు. రెండోసారీ, మూడోసారి చూడటం ఆరంభించారు. మామూలు హిట్ కాదు.. పెద్ద హిట్, మూడో వారంలో బ్లాక్లో టిక్కెట్లు కొని మరీ చూశారు కొందరు. దర్శక-నిర్మాతల ఆనందానికి అవధులు లేవు. ఎక్కడ చూసినా ‘శంకరాభరణం’ పాటలే. తమిళ, కన్నడ భాషల్లో కూడా బాగా ఆడింది. మలయాళంలో మాటలు డబ్ చేసి, పాటలను తెలుగులోనే ఉంచి విడుదల చేశారు. అక్కడా పెద్ద హిట్. కొనలేకపోయినవాళ్లు నెత్తినోరూ కొట్టుకొన్నారు. అమ్ముడుపోక తానే అట్టిపెట్టుకున్న జిల్లాల ద్వారా నిర్మాతకు కలెక్షన్ల పంట పండింది. అవార్డు, రివార్డులు మిగిలినదంతా చరిత్ర.
ఈ సినిమా విడుదలైన తర్వాత విశ్వనాథ్ కారులో విశాఖపట్నం వెళ్తున్నారట. కారు డ్రైవర్తో విశ్వనాథ్ మాట్లాడుతూ ‘సినిమా చూశావా’అని అడిగితే, ‘పదిసార్లు చూశాను సర్’ అన్నాడట. ‘అన్నిసార్లు చూడటానికి అందులో ఏముంది’ అని అడిగారట. ‘ఏమో తెలియదు సర్. థియేటర్కు వెళ్లిన ప్రతిసారి గుడికి వెళ్లిన భావన కలుగుతోంది’ అన్నాడట. సినిమా చూడటానికి థియేటర్కు వెళ్లిన చాలా మంది చెప్పులు విడిచి మరీ ‘శంకరాభరణం’ (sankarabharanam) చూశారంటే అతిశయోక్తికాదు. సినీ పరిశ్రమ వర్గాలనే కాదు, సామాన్యులను సైతం మెప్పించిందీ చిత్రం. ఒకరోజు దర్శకుడు బాపు ఈ సినిమా చూడటానికి థియేటర్కు వెళ్లారట. అప్పటికి ఆయన ‘శంకరాభరణం’ ఏడెనిమిదిసార్లు చూశారు. విరామ సమయంలో బయటకు వస్తే, ఇద్దరు పాఠశాల అమ్మాయిలు బాపు దగ్గరకు వచ్చి ‘ఆటోగ్రాఫ్ ఇస్తారా’ అని అడిగారట. ‘నా దగ్గర పెన్ను లేదు’ అని బాపు సమాధానం ఇస్తే, తమ వద్ద ఉన్న జామెట్రీ బాక్సులో పెన్సిల్ ఇచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అక్కడి నుంచి వెళ్తూ, ‘ఈ సినిమాకు మీరే కదా దర్శకులు’ అని అడిగారట. ‘నేను కాదమ్మా’ అని బాపు సమాధానం ఇవ్వగానే, పక్కనున్న స్నేహితురాలితో ‘బాక్సులోని రబ్బరు ఇటు ఇవ్వవే’ అని ఆటోగ్రాఫ్ తీసుకున్న అమ్మాయి అన్నదట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా బాపునే పంచుకున్నారు. అది విశ్వనాథ్ సినిమా అంటే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.4000తో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా: నాని
ఓ ఇంటర్వ్యూలో తన మొదటి జీతం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని ‘Nani’ -
ఆ సినిమా సమయంలో విజయ్ని చూసి భయపడ్డా.. రష్మిక
గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండను చూసి నిజంగా భయపడిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు రష్మిక. -
‘ఇంద్ర’ను తెరకెక్కించేందుకు వెనకడుగేశారు కానీ: ఈ బ్లాక్ బస్టర్ మూవీ విశేషాలు తెలుసా?
చిరంజీవి హీరోగా బి. గోపాల్ తెరకెక్కించిన చిత్రం ‘ఇంద్ర’. ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు.. -
‘మల్లీశ్వరి’లో డైనింగ్ టేబుల్ సీన్.. ఆసక్తికర విషయం పంచుకున్న కె.విజయ భాస్కర్
దర్శకుడు కె. విజయ భాస్కర్ ఇంటర్వ్యూలో తాను తీసిన మల్లీశ్వరి సినిమాలో ఆ సన్నివేశాలు ఎప్పటికీ మరచిపోలేనివి అంటూ గుర్తు చేసుకున్నారు. -
ఒకే రోజు .. రెండు సినిమాలు.. ఒకే దర్శకుడు..
ఒకే రోజున ఒక హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలైతే అది వారి అభిమానులకు విశేషమైన పండగే. అలాగే ఒకే హీరోయిన్ రెండు సినిమాల్లో నటించి, ఆ రెండు చిత్రాలు ఒకేరోజున విడుదలైన సందర్భాలు ఉన్నాయి. -
‘ఎవడు వాడు.. మంచి ఛాన్స్ పోగొట్టాడు’
‘పుష్పవిమానం’ మూవీలో కథానాయిక ఎంపికకు సంబంధించి జరిగిన ఆసక్తికర విషయాన్ని సింగీతం శ్రీనివాసరావు ఓ సందర్భంలో పంచుకున్నారిలా.. -
ఆల్టైమ్ క్లాసిక్ ‘ఆదిత్య 369’కు 33 ఏళ్లు.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
ప్రస్తుతం ‘కల్కి’ చూసి భవిష్యత్లో ప్రపంచం ఇలా ఉంటుందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, కొన్నేళ్ల కిందటే ప్రేక్షకుడిని భూత, భవిష్యత్తు కాలాల్లో ప్రయాణించిన అనుభూతి కలిగించిన చిత్రం ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ (జులై 18, 1991) విడుదలై 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. -
‘ఈ పాత్రకు ఎందుకు ఎంపిక చేశారండి’ అన్న వాణీవిశ్వనాథ్.. విడుదల తర్వాత స్టార్డమ్
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ సందర్భంలో వాణీ విశ్వనాథ్ అన్న మాటలు గుర్తు చేసుకున్నారు. -
ట్రైలర్ షేర్ చేసి.. సినిమా ఆఫర్ అందుకుని: ‘మావీరన్’ అలా మొదలైంది
‘మావీరన్’ సినిమా విశేషాలు పంచుకున్నారు హీరో శివకార్తికేయన్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
‘రోబో’లో మైఖేల్ జాక్సన్ పాట.. అలా మిస్సయింది!
‘రోబో’లో మైఖేల్ జాక్సన్తో పాట పాడించాలనుకున్న విషయాన్ని రెహమాన్ తాజాగా పంచుకున్నారు. -
రాజమౌళిని ఇబ్బంది పెట్టిన సుకుమార్ షాట్
సుకుమార్ తీసిన ‘1: నేనొక్కడినే’ మూవీలో ఓ షాట్ గురించి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
‘బాహుబలి’ ఇంటర్వెల్.. ఆ డైలాగ్స్ వెర్షన్తో తెరకెక్కించి ఉంటే!
ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ చిత్రం గురించి పలు ఆసక్తికర విశేషాలివీ.. -
‘భారతీయుడు’ కోసం ఈ తెలుగు హీరోలను అనుకున్నారు కానీ..
కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘భారతీయుడు’ గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
‘ఒక్కడు’ మూవీకి తొలుత అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?
Okkadu movie: మహేశ్బాబు కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ తొలుత వేరే టైటిల్ అనుకున్నారు. -
ఆ అవమానం మరిచిపోలేని అక్కినేని..
నటుడిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆయనకు ఎదురైన అవమానాలనే సోపానాలుగా చేసుకుని విజయం వైపు పయనించారు అక్కినేని -
హోటల్లో వెయిటర్గా నాజర్.. చిరంజీవికి విషయం తెలియడంతో..
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్లో వెయిటర్గా పనిచేశారట సినీ నటుడు నాజర్.. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
‘భారతీయుడు 2’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. ‘రోబో’, ‘2.ఓ’ల్లో తానెందుకు నటించలేదో వివరించారు. -
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
తానెందుకు సినిమాటిక్ యూనివర్స్లో చిత్రాలు తెరకెక్కించలేదన్న ప్రశ్నపై దర్శకుడు శంకర్ స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. -
అరవింద స్వామి మంచంపై.. రజనీ నేలపై..!
దళపతి సినిమా చిత్రీకరణ సందర్భంగా నేలపై పడుకున్న రజనీకాంత్ను చూసి అరవిందస్వామి షాకయ్యారు. -
కమల్ స్థానంలో మోహన్లాల్.. షారుక్ ప్లేస్లో అజయ్ దేవ్గణ్
తాను గతంలో తెరకెక్కించిన ఓ సినిమాకు సంబంధించి దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. అదే సినిమా అంటే? -
ఆయనే ‘వైజయంతీ మూవీస్’ అని పేరు పెట్టారు
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘వైజయంతీ మూవీస్’ అసలు ఎలా ఏర్పాటైందో తెలుసుకుందామా!
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?