NTR: ఎన్టీఆర్ కోసం సైఫ్?.. ఈ నెలలోనే సెట్స్పైకి వెళ్లే అవకాశాలు
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ (NTR) 30వ చిత్రం పక్కా పాన్ ఇండియా హంగులతో రూపొందుతోంది. నటుల ఎంపిక దాదాపు తుదిదశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ నెలలోనే సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి.
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ (NTR) 30వ చిత్రం పక్కా పాన్ ఇండియా హంగులతో రూపొందుతోంది. నటుల ఎంపిక దాదాపు తుదిదశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ నెలలోనే సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించనున్న సంగతి తెలిసిందే. ప్రతినాయకుడిగానూ బాలీవుడ్ నటుడే కనిపిస్తారని కొంతకాలంగా వినిపించింది. ఆ పాత్ర చేయడానికి బాలీవుడ్కి చెందిన ప్రముఖ కథానాయకుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) పచ్చజెండా ఊపారని సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించారు. తదుపరి చేయనున్న చిత్రం కూడా అదే స్థాయిలో ఉండేలా ఎన్టీఆర్ - కొరటాల శివ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఆ మేరకు కథ, కథనాలతోపాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసుకొంటున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తుండగా, కల్యాణ్రామ్ సమర్పిస్తున్నారు.
‘నాటు నాటు’ గూగుల్ సెర్చ్ రికార్డులు..: విడుదలైన దగ్గరి నుంచి తగ్గేదేలే అంటూ క్రేజ్ సొంతం చేసుకున్న ‘నాటు నాటు’ (Naatu Naatu) ఏకంగా ఆస్కార్ను గెలుచుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుతో ఈ పాట రేంజ్ అమాంతం పెరిగింది అందుకే ప్రస్తుతం ప్రపంచమంతా ‘నాటు నాటు’తో మారుమోగిపోతుంది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు ప్రకటించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు దీని కోసం తెగ వెతికేసినట్లు తాజా అధ్యాయనంలో వెల్లడైంది. ఆస్కార్ ప్రకటించాక ఈ పాటను 10 రెట్లు అధికంగా వెతికినట్లు జపాన్కు చెందిన ఓ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 1,105 శాతం సెర్చ్తో ‘నాటు నాటు’ రికార్డు సృష్టించిందని తెలిపింది.
ఆ క్షణాల్ని మరిచిపోలేను
ఆస్కార్ (Oscars 2023) వేదికపై నాటు నాటు పాటకిగానూ సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ పురస్కారాల్ని స్వీకరించిన క్షణాల్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు ఎన్టీఆర్ (NTR). 95వ ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్కి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా అనిపించింది. అదొక అద్భుతమైన అనుభవం. భారతీయుడిని...అందులోనూ తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నా. మేం ఇంతటి గౌరవాన్ని దక్కించుకున్నామంటే కారణం అభిమానులు, సినీ ప్రేమికులు. వాళ్ల ప్రేమ, ఆశీస్సుల వల్లే ఇది సాధ్యమైంది. ఆస్కార్ పురస్కారం వచ్చిన వెంటనే మొదటగా నా భార్యకి ఫోన్ చేసి ఆనందాన్ని పంచుకున్నా’’ అన్నారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న నృత్య దర్శకుడు ప్రేమ్రక్షిత్ (Prem Rakshith) మాట్లాడుతూ ‘‘ఆస్కార్ వేడుకల్లో వేదికపై పాట ప్రదర్శన పూర్తయిన వెంటనే అక్కడున్నవాళ్లందరూ లేచి నిలుచొని చప్పట్లు కొట్టారు. ఆ క్షణం కన్నీళ్లు వచ్చాయి. అవార్డు తీసుకన్న తర్వాత కీరవాణి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణం నేను పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేన’’న్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్