Manchu Manoj: ‘ఉస్తాద్‌’ ఆట మొదలు

వెండితెరపై నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయకులు బుల్లి తెర హోస్ట్‌లుగా అదరగొడుతున్నారు. ఇప్పుడు ఇదే బాటలోకి రానున్నారు కథానాయకుడు మంచు మనోజ్‌.

Updated : 30 Nov 2023 06:42 IST

వెండితెరపై నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయకులు బుల్లి తెర హోస్ట్‌లుగా అదరగొడుతున్నారు. ఇప్పుడు ఇదే బాటలోకి రానున్నారు కథానాయకుడు మంచు మనోజ్‌. ‘ఉస్తాద్‌’ అంటూ ఇటీవలే తన రాబోయే గేమ్‌ షో వివరాలు ప్రకటించారాయన. పలు సినిమాలతో అభిమానులకు దగ్గరైన ఆయన.. ఇందులో వ్యాఖ్యాతగా సరికొత్త పాత్ర పోషించనున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. తాజాగా ఈ గేమ్‌ షో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘ర్యాంప్‌ ఆడిద్దాం’ అనే ట్యాగ్‌లైన్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు మంచు మనోజ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని