Mansion 24: హారర్ సిరీస్.. ‘మాన్షన్ 24’
‘రాజు గారి గది’ లాంటి హారర్ కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈ సారి ‘మాన్షన్ 24’ అనే సరికొత్త వెబ్ సిరీస్తో రాబోతున్నారు.
‘రాజు గారి గది’ లాంటి హారర్ కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈ సారి ‘మాన్షన్ 24’ అనే సరికొత్త వెబ్ సిరీస్తో రాబోతున్నారు. అశ్విన్ బాబు, కల్యాణ్ చక్రవర్తి నిర్మించారు. వరలక్ష్మి శరత్కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు కీలక పాత్రలు పోషించనున్న ఈ సిరీస్ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. దర్శకుడు అనిల్ రావిపూడి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ...‘ఎంత ఎదిగినా చిన్న సినిమాలకు, సిరీస్లకు అతిథిగా వచ్చే అనిల్కు కృతజ్ఞతలు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. కొద్ది రోజుల్లోనే ఓటీటీకి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఇలాంటి సమయంలోనే ఈ సిరీస్ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో అభిమానులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు బలంగా నా తమ్ముళ్లు ఉన్నారు. వారు లేకుంటే నేను ఈ స్టేజ్మీద ఉండేవాడిని కాదేమో. ఈ ప్రాజెక్టు కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఈ సిరీస్లోని ఆరు ఎపిసోడ్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి’ అన్నారు. ‘ఈ సిరీస్ ట్రైలర్ చాలా బాగుంది. వరలక్ష్మి నటన అద్భుతంగా ఉంది. ఓంకార్ నాకు ‘పటాస్’ నుంచి పరిచయం. ఓటీటీలో రానున్న ఈ సిరీస్ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అన్నదమ్ములు కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు అనిల్ రావిపూడి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘విద్యా వాసుల అహం’ నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
‘విద్యా వాసుల అహం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఎప్పుడంటే? -
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే అంటూ ‘సర్కార్’లో ఓటు ప్రాధాన్యం గురించి విజయ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. -
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
trinayani serial actress died: బుల్లితెర నటి పవిత్రా జయరాం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు -
ఒక్క రోజేంటి?.. ఈ జీవితమే అమ్మది: చిరంజీవి
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్లు పెట్టారు. -
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
విక్కీ కౌశల్, సారా అలీఖాన్ కీలక పాత్రల్లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ‘జర హట్కే జర బచ్కే’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
నటిగా ఎదగడానికి కారణం ఈ చిత్రం: కృతి సనన్
చిత్రపరిశ్రమలో మంచి నటీనటులుగా ఎదగడానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కారణం ఉంటుంది. తన జీవితంలో కూడా ‘రాబ్తా’ కీలక పాత్ర పోషించిందని అంటోంది బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ -
హిందీ బాక్సాఫీస్ ఆశలన్నీ...దక్షిణాది సినిమాలపైనే!
‘పఠాన్’, ‘జవాన్’, ‘గదర్ 2’, ‘యానిమల్’... తదితర చిత్రాలతో గతేడాది ఫామ్లోకి వచ్చినట్టు కనిపించింది బాలీవుడ్. కానీ ఈ ఏడాదిలో మళ్లీ ఎదురు గాలి మొదలైంది. -
ముచ్చటగా మూడోసారి
ప్రస్తుతం ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ రష్మిక హవా కనిపిస్తోంది. వరుసగా అగ్రతారల సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ జోరు చూపిస్తోంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో మిస్టర్ బచ్చన్ మీటింగ్
రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫిల్మ్సిటీలో జరుగుతోంది. -
వెతుకు.. సత్యభామ.. వెతుకు!
కాజల్ పోలీసు పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల తెరకెక్కించిన ఈ సినిమాని బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి సంయుక్తంగా నిర్మించారు -
మురుగడి మాయేరా.. సిత్తరం ఉంటే సెప్తాదా
‘హరోం హర’ చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు సుధీర్బాబు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు -
లేదే.. లేదే.. లోకంలోనే ప్రేమే లేదసలే
‘రాజు యాదవ్’గా సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. -
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
రెంటచింతలలో వైకాపా నేతల దాడి.. పలువురికి గాయాలు
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు