MAA Elections: 10న గెలిచాక మొదట విష్ణుకే ఫోన్ చేస్తా! మంచు ఫ్యామిలీపై ప్రకాశ్రాజ్ సెటైర్లు
‘మా’ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంచు కుటుంబంపై ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. కొన్ని కుటుంబాలకే పెత్తనం కావాలని మోహన్బాబు.......
హైదరాబాద్: ‘మా’ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంచు కుటుంబంపై ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. కొన్ని కుటుంబాలకే పెత్తనం కావాలని మోహన్బాబు అన్నారన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరు కుటుంబాల్లో పుట్టకపోవడం నా తప్పా? అని ప్రశ్నించారు. ‘‘మా’ సభ్యుడిగా నాకు పోటీచేసే హక్కు లేదా? ‘మా’ నాయకత్వం కొన్ని కుటుంబాలకే ఉండాలా? నాకు ఇక్కడే ఇల్లు ఉంది.. ఆధార్ కార్డూ ఉంది. నేను ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నా. సీఎం జగన్ తన బంధువని విష్ణు చెబుతున్నారు. జగన్.. విష్ణు ఒక్కరికే కాదు.. ఏపీ మొత్తానికి సీఎం కదా! మా ఎన్నికల్లోకి జగన్ను ఎందుకు లాగుతున్నారు? కేటీఆర్ నాకూ స్నేహితుడే నేను చెప్పుకోవట్లేదు’’ అన్నారు.
గెలిచాక మొదటి ఫోన్ విష్ణుకే చేస్తా
‘‘కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం సమయంలో చిరంజీవి సినీ పరిశ్రమకు ఎంతో సాయం చేశారు. మంచు కుటుంబం పరిశ్రమకు ఏం చేసింది. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఇప్పటికీ.. ఎప్పటికీ చిరు అన్నయ్యే. ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్.. సినీ పరిశ్రమకు ఆస్తులు. పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమకు పెద్ద నిధి. నా పాత వివాదాలను ఇప్పుడు ప్రచారంలోకి తెస్తున్నారు. వివాదాలు సమసిపోయినా ఇంకా ఎందుకు ప్రస్తావన? ఈ నెల 10న గెలిచాక మొదటి ఫోన్ విష్ణుకే చేస్తా. ‘మా’ భవన నిర్మాణానికి విష్ణు సాయం కూడా తీసుకుంటా’’ అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. మా సభ్యులకు మంచి చేయడంతోపాటు ఇన్నాళ్లు మా అసోసియేషన్ ప్రతిష్ఠను దెబ్బతీసిన పెద్దలను ప్రశ్నించేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్రాజ్ వివరించారు.
అందుకే అలా స్పందించా!
‘విష్ణు ఒకటి గుర్తు పెట్టుకో... పవన్కల్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండదు నీ సినిమా బడ్జెట్’ అంటూ ఇటీవల మంచు విష్ణుపై తాను చేసిన వ్యాఖ్యల గురించి తాజాగా నటుడు ప్రకాశ్రాజ్ స్పందించారు. వ్యక్తిగతంగా విష్ణుతో తనకి మంచి సంబంధాలున్నాయని.. ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత కూడా ప్రతిఒక్కరూ మర్యాదగానే వ్యవహరించాలని అన్నారు. తనపై నరేశ్, విష్ణు టీమ్ సభ్యులు వ్యాఖ్యలు చేయడం వల్లే.. తాను ఆరోజు ఫైర్ అవ్వాల్సి వచ్చిందని చెప్పారు.
‘‘విష్ణుతో నాకు మంచి సంబంధాలున్నాయి. నన్ను ‘అంకుల్’ అని పిలుస్తుంటాడు. మేమిద్దరం బాగానే మాట్లాడుకుంటాం. మంచు విష్ణు కూడా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని తెలిసిన తర్వాత.. నేను అతనికి ఫోన్ చేసి మాట్లాడాను. ‘ఎన్నికల బరిలో ఉన్నాం కాబట్టి.. ఎవరి అజెండాలను వాళ్లు ప్రమోట్ చేసుకుందాం. వ్యక్తిగత విషయాలు, విమర్శల జోలికి వెళ్లొద్దు’ అని చెప్పాను. దానికి అతను ఓకే అన్నాడు. కానీ ఇటీవల మంచు విష్ణు - నరేశ్ కలిసి ప్రెస్మీట్ పెట్టారు. అందులో నన్ను, నా ప్యానల్లోని సభ్యుల్ని కించపరిచేలా నరేశ్, మరి కొంతమంది మాట్లాడారు. మరికొన్నిరోజుల్లో ఎన్నికలు జరుగుతుండగా వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటి? అదీ కాకుండా.. ‘నువ్వు ఇండస్ట్రీ సైడ్ ఉన్నావా? పవన్కల్యాణ్ సైడ్ ఉన్నావా? చెప్పాలి’ అంటూ వాళ్లు చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. పవన్కల్యాణ్ కూడా ఈ ఇండస్ట్రీలో సభ్యుడే. సినీనటుడి తర్వాతే ఆయన రాజకీయ నాయకుడు అయ్యాడు. వాళ్ల వ్యాఖ్యలను తిప్పి కొట్టడం కోసమే ఆరోజు మంచు విష్ణుపై కామెంట్ చేశాను’ అని ప్రకాశ్రాజ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
కథానాయకుడు రామ్ త్వరలో ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కానీ, దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. -
పూజ సరికొత్త ప్రయాణం..
దక్షిణాదితోపాటు.. ఇటు బాలీవుడ్లోనూ ఇప్పటికే తానెంటో నిరూపించుకుంది కథానాయిక పూజా హెగ్డే. గతేడాది ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంతోనే సరిపెట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి వరుస సినిమాలతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. -
తెరపైనా ఫిల్మ్ స్టారే!
‘ఖో గయే హమ్ కహా’తో గతేడాదికి మంచి ముగింపే పలికింది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. ఈ ఏడాది ‘కంట్రోల్’, ‘శంకర’ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె మరో చిత్రంలో కీలక పాత్రలో మెరవనుంది. -
ఇద్దరు నాయికలతో..!
వెంకటేశ్ కొత్త చిత్రం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా... సంగీతం పనులూ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. జులైలో సినిమాని పట్టాలెక్కించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ప్రచారంలో ఉంది. -
తలపడితే వదలడే.. తన పేరు విజయుడే
‘రాయన్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు కథానాయకుడు ధనుష్. ఇది ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది. -
‘డార్లింగ్’ పూర్తయింది
‘డార్లింగ్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించనుంది నభా నటేష్. ఆమె.. ప్రియదర్శి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. -
మనోహరం... రామనామం
ప్రతి పౌరుడూ రాముడిలా బతకాలని...ధర్మబద్ధంగా మెలగాలని చెప్పే కథతోనే ‘రామ జన్మభూమి’ చిత్రాన్ని తెరకెక్కించినట్టు వి.సముద్ర తెలిపారు. ఆయన దర్శకనిర్మాతగా...జై సిద్ధార్థ్, శ్రీరాధా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. -
కేన్స్ చిత్రోత్సవంలో ‘భారత్ పర్వ్’ వేడుక
ఎన్నో ప్రఖ్యాత వేదికలపై ఇప్పటికే మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పింది సినిమా రంగం. ఇప్పుడు తొలిసారి భారతదేశం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పర్వ్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదలైంది
అజిత్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. శుక్రవారం నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభించుకుంది. -
కాండ్రకోట రహస్యం
వరుణ్సందేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం