Rakesh: ముగింపును.. ప్రతినాయకుణ్ని ఊహించలేరు!
‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలతో నిండిన థ్రిల్లర్ చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. ఇందులో ప్రతి ముప్పై నిమిషాలకు ఊహించని మలుపు వస్తుంది’’ అన్నారు రాకేష్ ఉప్పలపాటి.
‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలతో నిండిన థ్రిల్లర్ చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. ఇందులో ప్రతి ముప్పై నిమిషాలకు ఊహించని మలుపు వస్తుంది’’ అన్నారు రాకేష్ ఉప్పలపాటి. ఇది ఆయనకు దర్శకుడిగా తొలి చిత్రం. బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా నటించారు. సతీష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా జూన్ 2న రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో శనివారం విలేకర్లతో ముచ్చటించారు రాకేష్.
‘‘ఈ చిత్రానికి కృష్ణ చైతన్య కథ అందించారు. ఇదొక భిన్నమైన థ్రిల్లర్లా ఉంటుంది. దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఇష్టమైన ఫోన్.. అవసరమైన ఐడెంటిటీ.. భయపెట్టే గన్.. ఈ మూడింటి చుట్టూ కథ తిరుగుతుంటుంది. అలాగే హీరోకి కమిషనర్కు మధ్య గొడవ ఎలా మొదలైంది.. అది ఏ దిశగా సాగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్ర ముగింపును, విలన్ను అసలు ఊహించలేరు. ఇది ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచుతుంది’’.
గౌతమ్ మేనన్తో చేయాలనుకున్నా..
‘‘ఈ సినిమాలోని కమిషనర్ పాత్రకు నేను తొలుత గౌతమ్ మేనన్ను అనుకున్నా. నిర్మాత సతీష్ మాత్రం సముద్రఖని పేరు సూచించారు. అయితే తుది నిర్ణయం మాత్రం నాకే వదిలేశారు. ఎందుకో ఆయన మాట విన్నాక ఈ పాత్రకు సముద్రఖని అన్ని విధాలా బాగుంటారనిపించింది.
‘జాన్ విక్’.. ‘విక్రమ్’ చిత్రాలు గుర్తొస్తాయి!
‘‘ఈ సినిమాకి మేము ఆరంభంలో ‘రింగ్’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నాం. తర్వాత చరవాణి అనే మరో టైటిల్ కూడా అనుకున్నాం. అదే సమయంలో నిర్మాత సతీష్ ‘సినిమాలో ఉన్న డైలాగ్ ప్రకారం టైటిల్ పెడదాం’ అన్నారు. దాంతో ‘నేను స్టూడెంట్ సార్’ అనే పేరు ఖరారు చేశాం’’.
‘‘మాది భీమడోలు పక్కన యం.నాగులపల్లి. నాన్న వ్యాపారం నిమిత్తం సుకుమార్ ఊరు పక్కన ఉన్న తాటిపాకకు మారాం. మధ్యతరగతి కుర్రాళ్లకు ఓ గుర్తింపు సాధించుకోవాలన్న తపన ఉంటుంది. నేనూ అదే తపనతో గుర్తింపు కోసం సినిమాల్లోకి వచ్చా. గోగినేని శ్రీనివాస్ నిర్మాణంలో ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ చిత్రానికి పని చేశా. ఆ తర్వాత దర్శకుడు తేజ దగ్గర సహాయకుడిగా చేరా. ‘నీకు నాకు డాష్ డాష్’ నుంచి ‘అహింస’ స్క్రిప్ట్ వర్క్ వరకు ఆయనతో కలిసి పని చేశా. ఇప్పుడీ చిత్రంతో దర్శకుడిగా మారా. తదుపరి సినిమాని సతీష్ నిర్మాణంలోనే చేయనున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
కథానాయకుడు రామ్ త్వరలో ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కానీ, దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. -
పూజ సరికొత్త ప్రయాణం..
దక్షిణాదితోపాటు.. ఇటు బాలీవుడ్లోనూ ఇప్పటికే తానెంటో నిరూపించుకుంది కథానాయిక పూజా హెగ్డే. గతేడాది ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంతోనే సరిపెట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి వరుస సినిమాలతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. -
తెరపైనా ఫిల్మ్ స్టారే!
‘ఖో గయే హమ్ కహా’తో గతేడాదికి మంచి ముగింపే పలికింది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. ఈ ఏడాది ‘కంట్రోల్’, ‘శంకర’ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె మరో చిత్రంలో కీలక పాత్రలో మెరవనుంది. -
ఇద్దరు నాయికలతో..!
వెంకటేశ్ కొత్త చిత్రం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా... సంగీతం పనులూ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. జులైలో సినిమాని పట్టాలెక్కించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ప్రచారంలో ఉంది. -
తలపడితే వదలడే.. తన పేరు విజయుడే
‘రాయన్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు కథానాయకుడు ధనుష్. ఇది ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది. -
‘డార్లింగ్’ పూర్తయింది
‘డార్లింగ్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించనుంది నభా నటేష్. ఆమె.. ప్రియదర్శి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. -
మనోహరం... రామనామం
ప్రతి పౌరుడూ రాముడిలా బతకాలని...ధర్మబద్ధంగా మెలగాలని చెప్పే కథతోనే ‘రామ జన్మభూమి’ చిత్రాన్ని తెరకెక్కించినట్టు వి.సముద్ర తెలిపారు. ఆయన దర్శకనిర్మాతగా...జై సిద్ధార్థ్, శ్రీరాధా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. -
కేన్స్ చిత్రోత్సవంలో ‘భారత్ పర్వ్’ వేడుక
ఎన్నో ప్రఖ్యాత వేదికలపై ఇప్పటికే మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పింది సినిమా రంగం. ఇప్పుడు తొలిసారి భారతదేశం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పర్వ్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదలైంది
అజిత్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. శుక్రవారం నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభించుకుంది. -
కాండ్రకోట రహస్యం
వరుణ్సందేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..