sai durga tej: కథ కుదిరింది

గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు సాయిదుర్గా తేజ్‌. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు. ఆ మధ్య సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.

Updated : 29 Apr 2024 09:37 IST

తేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు సాయిదుర్గా తేజ్‌. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు. ఆ మధ్య సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు సాయితేజ్‌ తదుపరి సినిమాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. తను రాకేశ్‌ అనే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. 1940ల నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని.. ఇందులో తేజ్‌ మునుపెన్నడూ చేయని ఓ విభిన్నమైన పాత్ర పోషించనున్నారని తెలిసింది. దీన్ని ‘హను-మాన్‌’ చిత్ర నిర్మాత నిరంజన్‌రెడ్డి నిర్మించనున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా జులై నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని