Saindhav: శ్రీలంకలో... ‘సైంధవ్‌’

వెంకటేశ్‌ కథానాయకుడిగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్‌’.

Updated : 11 Sep 2023 14:12 IST

వెంకటేశ్‌ కథానాయకుడిగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్‌’. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్‌ సిద్దిఖీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శైలేష్‌ కొలను దర్శకుడు. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. వెంకటేశ్‌తోపాటు, ఇతర ప్రధాన నటులపై కొన్ని పోరాట ఘట్టాలతోపాటు... ఒక పాటని తెరకెక్కిస్తున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. ఎనిమిది పాత్రల చుట్టూ తిరిగే ఈ సినిమాలో ప్రతి పాత్రా కీలకమైనదే అని సినీవర్గాలు అంటున్నాయి. డిసెంబరు 22న దక్షిణాది భాషలతోపాటు, హిందీలో విడుదల కానున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్‌.మణికందన్‌, కూర్పు: గ్యారీ బి.హెచ్‌., ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, సంగీతం: సంతోష్‌ నారాయణ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని