sandeep reddy vanga: నానితో లవ్స్టోరీ ఆ భయంతో చెప్పలేకపోయిన సందీప్ వంగా!
‘అర్జున్రెడ్డి’ కన్నా ముందు ఓ ప్రేమకథను అనుకున్న ఆయన దాన్ని నానితో తీద్దామనుకున్నారు. కానీ, కలిసి కథ చెప్పేందుకు కాస్త ఆలోచించడంతో అది పట్టాలెక్కలేదు.
హైదరాబాద్: ‘అర్జున్రెడ్డి’తో యువతను ఆకట్టుకున్న దర్శకుడు సందీప్రెడ్డి వంగా. ఇటీవల రణ్బీర్తో ‘యానిమల్’ (Animal) తీసి, మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని సందీప్ బయటపెట్టారు. ‘అర్జున్రెడ్డి’ కన్నా ముందు ఓ ప్రేమకథను అనుకున్న ఆయన దాన్ని నానితో తీద్దామనుకున్నారు. కానీ, కలిసి కథ చెప్పేందుకు కాస్త ఆలోచించడంతో అది పట్టాలెక్కలేదు.
అది 2010-11. ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన సందీప్ (sandeep reddy vanga) ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఒక మంచి లవ్స్టోరీ అనుకుని ఒక నిర్మాతకు వినిపించారు. కథ నచ్చిన ఆ నిర్మాత ‘హీరో ఎవరు’ అని అడిగితే, ‘నాని’ (Nani) అని సందీప్ సమాధానం ఇచ్చారు. ‘నాని ఎవరు’ అంటూ ఆ నిర్మాత ప్రశ్నించడంతో, ‘‘అష్టాచమ్మా’లో నటించాడు. ఆ సినిమా నేను చూడలేదు. కానీ, ఇప్పుడు ‘రైడ్’ చేశాడు. చాలా బాగుంది. అతని డైలాగ్ మాడ్యులేషన్ నాకు నచ్చింది. మాస్ హీరోకు ఉండాల్సిన అంశాలు అతనిలో ఉన్నాయి. ఈ కథకు అతడు డిఫరెంట్గా ఉంటాడు’’ అని చెప్పాడు. వెంటనే స్పందించిన ఆ నిర్మాత ‘ఆ హీరో వద్దు.. ఈ నాలుగు పేర్లు పరిశీలించు’ అని ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు హీరోల పేర్లు ఆప్షన్గా ఇచ్చాడు. అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో అది వినియోగించుకునే పరిస్థితి ఉన్నా ‘నా కథకు ఈ హీరోలు సరిపోరు’ అని చెప్పి సందీప్ వంగా ఆయన దగ్గరి నుంచి వచ్చేశాడు. ఇదే విషయాన్ని ఫ్రెండ్స్కు చెబితే, ‘నీకేమైనా పిచ్చా’ అంటూ తిట్టారట.
ఆ తర్వాత కొన్ని రోజులకు బంజారాహిల్స్లోని ‘మోకా’ రెస్టారెంట్కు వెళ్తే, అక్కడ స్నేహితులతో కలిసి నాని ఉండటాన్ని సందీప్ గమనించారు. అప్పుడు నాని దగ్గరకు వెళ్లి, ‘నేను ఒక నిర్మాతకు కథ చెప్పాను. ఆయన వేరే హీరో అన్నారు. కానీ, నా కథలో మీరే హీరో. కథ చెబుతా వింటారా’ అని అడుగుదామని పదే అనుకున్నారట. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో వెళ్లి అడిగితే, ‘నన్ను ఇబ్బంది పెట్టొద్దు. వెళ్లండి’ అంటారేమోనని భయపడి నానికి కథ చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేశారట. ఒకవేళ అప్పుడే ఆ కథను నాని చెప్పి, ఆయన ఒప్పుకొని ఉంటే, ‘అర్జున్రెడ్డి’ కన్నా ముందే సందీప్ దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యేవారు. తాజాగా ‘హాయ్ నాన్న’తో నాని, ‘యానిమల్’తో సందీప్ వంగా ఒకేసారి ప్రేక్షకులను పలకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.4000తో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా: నాని
ఓ ఇంటర్వ్యూలో తన మొదటి జీతం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని ‘Nani’ -
ఆ సినిమా సమయంలో విజయ్ని చూసి భయపడ్డా.. రష్మిక
గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండను చూసి నిజంగా భయపడిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు రష్మిక. -
‘ఇంద్ర’ను తెరకెక్కించేందుకు వెనకడుగేశారు కానీ: ఈ బ్లాక్ బస్టర్ మూవీ విశేషాలు తెలుసా?
చిరంజీవి హీరోగా బి. గోపాల్ తెరకెక్కించిన చిత్రం ‘ఇంద్ర’. ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు.. -
‘మల్లీశ్వరి’లో డైనింగ్ టేబుల్ సీన్.. ఆసక్తికర విషయం పంచుకున్న కె.విజయ భాస్కర్
దర్శకుడు కె. విజయ భాస్కర్ ఇంటర్వ్యూలో తాను తీసిన మల్లీశ్వరి సినిమాలో ఆ సన్నివేశాలు ఎప్పటికీ మరచిపోలేనివి అంటూ గుర్తు చేసుకున్నారు. -
ఒకే రోజు .. రెండు సినిమాలు.. ఒకే దర్శకుడు..
ఒకే రోజున ఒక హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలైతే అది వారి అభిమానులకు విశేషమైన పండగే. అలాగే ఒకే హీరోయిన్ రెండు సినిమాల్లో నటించి, ఆ రెండు చిత్రాలు ఒకేరోజున విడుదలైన సందర్భాలు ఉన్నాయి. -
‘ఎవడు వాడు.. మంచి ఛాన్స్ పోగొట్టాడు’
‘పుష్పవిమానం’ మూవీలో కథానాయిక ఎంపికకు సంబంధించి జరిగిన ఆసక్తికర విషయాన్ని సింగీతం శ్రీనివాసరావు ఓ సందర్భంలో పంచుకున్నారిలా.. -
ఆల్టైమ్ క్లాసిక్ ‘ఆదిత్య 369’కు 33 ఏళ్లు.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
ప్రస్తుతం ‘కల్కి’ చూసి భవిష్యత్లో ప్రపంచం ఇలా ఉంటుందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, కొన్నేళ్ల కిందటే ప్రేక్షకుడిని భూత, భవిష్యత్తు కాలాల్లో ప్రయాణించిన అనుభూతి కలిగించిన చిత్రం ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ (జులై 18, 1991) విడుదలై 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. -
‘ఈ పాత్రకు ఎందుకు ఎంపిక చేశారండి’ అన్న వాణీవిశ్వనాథ్.. విడుదల తర్వాత స్టార్డమ్
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ సందర్భంలో వాణీ విశ్వనాథ్ అన్న మాటలు గుర్తు చేసుకున్నారు. -
ట్రైలర్ షేర్ చేసి.. సినిమా ఆఫర్ అందుకుని: ‘మావీరన్’ అలా మొదలైంది
‘మావీరన్’ సినిమా విశేషాలు పంచుకున్నారు హీరో శివకార్తికేయన్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
‘రోబో’లో మైఖేల్ జాక్సన్ పాట.. అలా మిస్సయింది!
‘రోబో’లో మైఖేల్ జాక్సన్తో పాట పాడించాలనుకున్న విషయాన్ని రెహమాన్ తాజాగా పంచుకున్నారు. -
రాజమౌళిని ఇబ్బంది పెట్టిన సుకుమార్ షాట్
సుకుమార్ తీసిన ‘1: నేనొక్కడినే’ మూవీలో ఓ షాట్ గురించి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
‘బాహుబలి’ ఇంటర్వెల్.. ఆ డైలాగ్స్ వెర్షన్తో తెరకెక్కించి ఉంటే!
ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ చిత్రం గురించి పలు ఆసక్తికర విశేషాలివీ.. -
‘భారతీయుడు’ కోసం ఈ తెలుగు హీరోలను అనుకున్నారు కానీ..
కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘భారతీయుడు’ గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
‘ఒక్కడు’ మూవీకి తొలుత అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?
Okkadu movie: మహేశ్బాబు కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ తొలుత వేరే టైటిల్ అనుకున్నారు. -
ఆ అవమానం మరిచిపోలేని అక్కినేని..
నటుడిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆయనకు ఎదురైన అవమానాలనే సోపానాలుగా చేసుకుని విజయం వైపు పయనించారు అక్కినేని -
హోటల్లో వెయిటర్గా నాజర్.. చిరంజీవికి విషయం తెలియడంతో..
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్లో వెయిటర్గా పనిచేశారట సినీ నటుడు నాజర్.. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
‘భారతీయుడు 2’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. ‘రోబో’, ‘2.ఓ’ల్లో తానెందుకు నటించలేదో వివరించారు. -
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
తానెందుకు సినిమాటిక్ యూనివర్స్లో చిత్రాలు తెరకెక్కించలేదన్న ప్రశ్నపై దర్శకుడు శంకర్ స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. -
అరవింద స్వామి మంచంపై.. రజనీ నేలపై..!
దళపతి సినిమా చిత్రీకరణ సందర్భంగా నేలపై పడుకున్న రజనీకాంత్ను చూసి అరవిందస్వామి షాకయ్యారు. -
కమల్ స్థానంలో మోహన్లాల్.. షారుక్ ప్లేస్లో అజయ్ దేవ్గణ్
తాను గతంలో తెరకెక్కించిన ఓ సినిమాకు సంబంధించి దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. అదే సినిమా అంటే? -
ఆయనే ‘వైజయంతీ మూవీస్’ అని పేరు పెట్టారు
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘వైజయంతీ మూవీస్’ అసలు ఎలా ఏర్పాటైందో తెలుసుకుందామా!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ