Taapsee: డైరెక్షన్ నుంచి తప్పుకున్న రాహుల్
మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శభాష్ మిథు’. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా...
ఇకపై నన్ను ఏమీ అడగకండి
ముంబయి: మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శభాష్ మిథు’. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్ అనంతరం ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ‘శభాష్ మిథు’ డైరెక్షన్ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు రాహుల్ డోలాకియా ప్రకటించారు. డేట్స్ సర్దుబాటు విషయంలో సమస్యలు తలెత్తడంతోనే తాను ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగుతున్నట్లు ఆయన తెలిపారు.
మిథాలీరాజ్ బయోపిక్ని అద్భుతంగా తెరకెక్కించాలని తాను భావించానని.. గడిచిన ఏడాదిన్నర కాలం నుంచి ఆ సినిమా గురించే ఎన్నో ఆశలు పెట్టుకున్నానని.. కరోనా వల్ల తన ఆశలన్నీ తారుమారు అయ్యాయని.. పరిస్థితుల రీత్యా తాను డైరెక్షన్ నుంచి తప్పుకుంటున్నానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఇకపై ‘శభాష్ మిథు’కు సంబంధించి ఎటువంటి అనుమానాలున్నా తనని అడగవద్దని ఆయన తెలిపారు. మరోవైపు శ్రీజిత్ ముఖర్జీ ప్రస్తుతం ఈసినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. అలాగే రష్యా టూర్లో ఉన్న తాప్సీ తర్వలోనే ‘శభాష్ మిథు’ సెట్లోకి అడుగుపెట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం