Vaishnav Tej: అంతా నన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంటోంది: వైష్ణవ్ తేజ్
‘కొండపొలం’ నటుడు వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ. ఈయన పంచుకున్న ఆసక్తికర విషయాలివీ....
ఇంటర్నెట్ డెస్క్: ‘ఉప్పెన’తో తొలి పరిచయంలోనే మంచి నటుడిగా వైష్ణవ్ తేజ్ మంచి గుర్తింపు పొందాడు. యువతలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నాడు. ఆయన చేసిన రెండో ప్రయత్నం ‘కొండపొలం’. క్రిష్ దర్శకుడు. రకుల్ ప్రీత్సింగ్ కథానాయిక. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవలాధారంగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఆసక్తికర విశేషాలివీ..
సందేశం.. కమర్షియల్ హంగులు
నేనెప్పుడూ ‘కొండపొలం’ గురించి వినలేదు. అందుకే కథ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఫాంటసీ ఎలిమెంట్స్ బాగా నచ్చాయి. ఇలాంటి ఓ మంచి కథని ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుని, వెంటనే ఓకే చేశా. సందేశంతోపాటు కమర్షియల్ హంగులూ మెండుగా ఉన్న కథ ఇది. జీరో నుంచి హీరో అయ్యే ఓ చురుకైన కుర్రాడి జీవితమిది. అడవి అంటే అతనికి బాగా ఇష్టం. దాని కోసం అతడేం చేశాడు? ఓబులమ్మ (రకుల్)తో ప్రేమ.. తదితర అంశాలు తెరపై చూస్తేనే బాగుంటుంది. క్రిష్ టేకింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన దర్శకత్వంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. క్రిష్ తెరకెక్కించిన వాటిల్లో ‘గమ్యం’, ‘వేదం’ చిత్రాలు నాకు బాగా ఇష్టం. నా రెండో చిత్రానికే కీరవాణిగారు స్వరాలు అందించడం మరిచిపోలేని జ్ఞాపకం. ఆయన తనయుడు కాల భైరవ నాకు మంచి స్నేహితుడు.
టెన్షన్ పడ్డా..
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వర్క్షాష్ నిర్వహించలేదు. డైరెక్టర్ ఎలా చెబితే అలా నటించా. పాత్రలో ఒదిగిపోయేందుకు కొన్ని రోజులు యాస ప్రాక్టీస్ చేశా. నా తొలి సినిమా (ఉప్పెన)కి దర్శకుడు, కథానాయిక కొత్తవారే కాబట్టి చాలా సరదాగా షూటింగ్ చేశాం. కానీ, ఈ సినిమాలో నటించేందుకు కొంచెం టెన్షన్ భయపడ్డా. ఎందుకంటే ఈ చిత్ర బృందమంతా సీనియర్లే. దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు కీరవాణి, కథానాయిక రకుల్ ప్రీత్సింగ్.. ఇలా అంతా అనుభవం ఉన్న వారే. కోట శ్రీనివాసరావుగారు ఇప్పటికీ అదే ఎనర్జీ చూపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన నటన చూసి ఆశ్చర్యపోయాను. సాయిచంద్గారు నటన అందరినీ మెప్పించేలా ఉంటుంది. వారి దగ్గర నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. అడవి గొప్పతనం, చెత్తని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా నిర్దేశించిన స్థలంలోనే వేయాలని ఈ సినిమా షూటింగ్లో భాగంగా తెలిసొచ్చింది.
ఎవరినీ అడగను..
రొటీన్కి భిన్నంగా సాగే కథలంటే నాకు ఇష్టం. అందులోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలనుకుంటా. ప్రభాస్ అన్న విలన్లని ఇలా కొడితే బాగుంటుంది, మహేశ్ బాబు గారు అలా కొడితే బాగుంటుందని నేను ఎలా అనుకుంటానో నా అభిమానులూ అలానే అనుకుంటారు కదా! మా కుటుంబంలో ఇంతమంది నటులున్నా నా చిత్రాల గురించి వారి దగ్గర ప్రస్తావించను. నాకు చాలా సిగ్గు. అందుకే ఫలానా కథ విన్నాను.. ఎలా ఉంది? అని ఎవరినీ అడగను.
చిత్రీకరణ దశలో..
కొవిడ్/లాక్డౌన్ సమయంలో షూటింగ్ చేశాం. ఎన్నో కొండలు ఎక్కాం, వాహనాలేవీ అందుబాటులో లేకపోవడంతో షూటింగ్ స్పాట్కి నడిచే వెళ్లాం. దీనికంటే రోజంతా మాస్క్ ధరించడమే కష్టమనిపించింది. మాస్క్ పెట్టుకోవడం వల్ల ఊపిరి సరిగా ఆడేది కాదు. తర్వాత అది అలవాటైంది. గొర్రెలపై సన్నివేశాలు చిత్రీకరించేటపుడు వాటి భాషని అర్థం చేసుకోలేకపోయా. వాటికి పచ్చళ్లు అంటే ఇష్టమని కొన్నాళ్లకి తెలిసింది. అలా గొర్నెల్ని కంట్రోల్ చేశా.
నేను ఊహించలేదు..
‘రిపబ్లిక్’ చిత్రంలో అన్నయ్య (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్గా కనిపించాడు, ‘కొండపొలం’ సినిమాలో నేను ఐఎఫ్ఎస్గా కనిపిస్తా. అంతమాత్రాన ఈ రెండు చిత్రాలకి సంబంధం ఉండదు.అన్నయ్య ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే మన ముందుకు వస్తాడు. మా మామయ్యలు, అన్నయ్యకు ఇమేజ్ రావడం నేను చూశాను. కానీ, నాకూ ఓ ఇమేజ్ అంటూ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు అంతా నన్ను చూస్తోంటే సిగ్గుగా ఉంటోంది! (నవ్వుతూ..)
తప్పకుండా నటిస్తా..
వెబ్ సిరీస్ అవకాశాలు ఇప్పటి వరకు రాలేదు. వస్తే తప్పకుండా నటిస్తా. ప్రస్తుతం గిరి సాయి (తమిళ ‘అర్జున్ రెడ్డి’ ఫేం) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. పాత్ర డిమాండ్ మేరకు రెండు చిత్రాల్లోనూ కాస్త డీ గ్లామర్గా కనిపించిన నేను ఇందులో కొత్తగా కనిపిస్తా. ఈ కథ రొమాంటిక్- కామెడీ నేపథ్యంలో సాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
కథానాయకుడు రామ్ త్వరలో ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కానీ, దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. -
పూజ సరికొత్త ప్రయాణం..
దక్షిణాదితోపాటు.. ఇటు బాలీవుడ్లోనూ ఇప్పటికే తానెంటో నిరూపించుకుంది కథానాయిక పూజా హెగ్డే. గతేడాది ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంతోనే సరిపెట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి వరుస సినిమాలతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. -
తెరపైనా ఫిల్మ్ స్టారే!
‘ఖో గయే హమ్ కహా’తో గతేడాదికి మంచి ముగింపే పలికింది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. ఈ ఏడాది ‘కంట్రోల్’, ‘శంకర’ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె మరో చిత్రంలో కీలక పాత్రలో మెరవనుంది. -
ఇద్దరు నాయికలతో..!
వెంకటేశ్ కొత్త చిత్రం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా... సంగీతం పనులూ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. జులైలో సినిమాని పట్టాలెక్కించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ప్రచారంలో ఉంది. -
తలపడితే వదలడే.. తన పేరు విజయుడే
‘రాయన్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు కథానాయకుడు ధనుష్. ఇది ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది. -
‘డార్లింగ్’ పూర్తయింది
‘డార్లింగ్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించనుంది నభా నటేష్. ఆమె.. ప్రియదర్శి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. -
మనోహరం... రామనామం
ప్రతి పౌరుడూ రాముడిలా బతకాలని...ధర్మబద్ధంగా మెలగాలని చెప్పే కథతోనే ‘రామ జన్మభూమి’ చిత్రాన్ని తెరకెక్కించినట్టు వి.సముద్ర తెలిపారు. ఆయన దర్శకనిర్మాతగా...జై సిద్ధార్థ్, శ్రీరాధా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. -
కేన్స్ చిత్రోత్సవంలో ‘భారత్ పర్వ్’ వేడుక
ఎన్నో ప్రఖ్యాత వేదికలపై ఇప్పటికే మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పింది సినిమా రంగం. ఇప్పుడు తొలిసారి భారతదేశం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పర్వ్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదలైంది
అజిత్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. శుక్రవారం నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభించుకుంది. -
కాండ్రకోట రహస్యం
వరుణ్సందేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు తరలే ఓటర్లకు తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?