తారస్థాయిలో దుబ్బాక ఉపఎన్నికల పోరు
దుబ్బాక ఉప ఎన్నిక పోరు తారాస్థాయికి చేరింది. ప్రచారానికి ముగింపు తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీలు జోరుపెంచాయి. త్రిముఖ పోరులో పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి...
వ్యూహాలు రచిస్తున్న పార్టీలు
విస్తృత ప్రచారం చేస్తున్న నేతలు
ఇంటర్నెట్ డెస్క్: దుబ్బాక ఉప ఎన్నిక పోరు తారాస్థాయికి చేరింది. ప్రచారానికి ముగింపు తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీలు జోరుపెంచాయి. త్రిముఖ పోరులో పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాన పార్టీల రాష్ట్ర నాయకత్వమంతా దుబ్బాకలోనే మకాం వేసి తమ అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నాయి. నవంబర్ 1న సాయంత్రం 5గంటలతో ప్రచార గడువు ముగియనుండటంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాయకులు ముందుకుసాగుతున్నారు. తెరాస తన ప్రచారంలో ప్రధానంగా భాజపాపై దృష్టిసారిస్తోంది. కేంద్ర నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారంటూ నేతలు ర్యాలీలు, సభల్లో ప్రస్తావిస్తున్నారు. సిద్దిపేటలో అంజన్రావు ఇంట్లో నగదు స్వాధీనం అనంతరం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తెరాస, భాజపా నాయకులు రాజకీయ ఆరోపణలతోపాటు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్.. తెరాస, భాజపా ఒక్కటేనని ఆరోపిస్తోంది.
కేంద్రం నిధులపై చర్చలకు రావాలని తాను సవాలు విసిరితే భాజపా నేతలు ముఖం చాటేశారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ప్రచారం నిర్వహించిన ఆయన దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
భాజపాతో తెరాస లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ఔన్నత్యాన్ని తాకట్టు పెడుతోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డితో కలిసి మిరుదొడ్డి మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. భాజపా తెచ్చే బిల్లులకు తెరాస మద్ధతు పలుకుతోందన్న రేవంత్రెడ్డి దుబ్బాకలో టీఆర్ఎస్ను ఓడిస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుతాయని పేర్కొన్నారు.
కేంద్రం నుంచి తెలంగాణకు భారీగా నిధులు వస్తున్నా తెరాస అసత్యాలు ప్రచారం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపా అభ్యర్థి రఘునందన్రావుకు మద్ధతుగా ఆయన మిరుదొడ్డి మండలం మోతెలో ప్రచారం చేశారు. రోజురోజుకూ దుబ్బాకలో భాజపాకు ఆదరణ పెరుగుతోందన్న సంజయ్ సర్వేలు సైతం కమలానికే పట్టం కడుతున్నాయని తెలిపారు.
దుబ్బాకలో ఉపఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ సునీల్ అరోరాకు లేఖ రాశారు. తెరాస, భాజపాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయన్న ఆయన ఎన్నికలకు రాష్ట్ర పోలీసులను, జిల్లా అధికారులను ఉపయోగించవద్దని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు