Arvind Kejriwal: భాజపాకు అతిపెద్ద ముప్పు మానుంచే : కేజ్రీవాల్
విశ్వాస పరీక్షలో భాగంగా అసెంబ్లీలో ప్రసంగించిన దిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) భాజపాపై విరుచుకుపడ్డారు.
దిల్లీ: భాజపా(BJP)కు అతిపెద్ద ముప్పు ఆప్ పార్టీతోనే అని, అందుకే తమపై అన్నివైపుల నుంచి దాడి జరుగుతోందని ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.
‘మనకు సభలో మెజార్టీ ఉంది. కానీ ఆప్ ఎమ్మెల్యేలను భాజపా కొనుగోలు చేయాలని యత్నిస్తోన్న తరుణంలో ఈ విశ్వాస తీర్మానం అవసరం. ఈసారి లోక్సభ ఎన్నికల్లో భాజపా గెలిచినా.. 2029 నాటికి ఈ దేశానికి ఆ పార్టీ నుంచి ఆప్(AAP) విముక్తి కలిగిస్తుంది’ అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తంచేశారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలుకు మీరు ఎంత డబ్బు వెచ్చించారు..? అని ఈసందర్భంగా భాజపాను ప్రశ్నించారు. ‘వారు నాపై సిరా చల్లారు. చెప్పులు విసిరారు. ఇప్పుడు అరెస్టు చేస్తామంటున్నారు. మీరు నన్ను జైల్లో పెడితే.. ఈ ప్రభుత్వం పడిపోతుందా..? అది కూడా ట్రై చేసి, మీ కల నెరవేర్చుకోండి. మీరు కేజ్రీవాల్(Kejriwal)ను అరెస్టు చేయగలరు.. కానీ ఆయన సిద్ధాంతాలను కాదు. ఒక కేజ్రీవాల్ను మట్టుపెడితే.. లక్షల్లో పుట్టుకొస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు.
భాజపాలోకి విపక్ష నేతలు.. ఖర్గే ప్రశ్నకు మోదీ సమాధానమిదే..!
‘ఎవరైనా భాజపా ఒత్తిడికి లోనై.. ఆ పార్టీలో చేరితే వారు అవినీతిపరులు. ఆ ఒత్తిడి ఎదుర్కొన్నవారు నిజాయతీపరులు. గుజరాత్లో 30 ఏళ్లుగా భాజపా అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్లో 15 ఏళ్లు, యూపీలో 10 ఏళ్లుగా కమలం పార్టీ ప్రభుత్వం నడుస్తోంది. ఈ రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ అందించండి. పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఇవన్నీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించాం. మేం రాముడి భక్తులమని భాజపా చెప్తోంది. కానీ మన ఆసుపత్రుల్లో పేదలకు మందులు నిలిపివేశారు. అయినా మీ శత్రుత్వం నాతో. దిల్లీ ప్రజల్ని ఎందుకు లాగుతారు..? నా హృదయం ద్రవించిపోతోంది’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఆరోసారి ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేసిన ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్(Arvind Kejriwal) కోరారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర నేతల అంతమే మోదీ లక్ష్యం
తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. -
విపక్ష నేతలకు రాసిన లేఖపై మీరు స్పందించడం ఆశ్చర్యమే
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలకు తాను రాసిన లేఖపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్, సిసోదియా వంటి వారిని భాజపా ఆహ్వానించదు
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలను భాజపాలోకి ఎప్పటికీ ఆహ్వానించబోమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ స్పష్టం చేశారు. -
వరుణ్కు టికెట్ ఇస్తే బాగుండేది: మేనకా గాంధీ
యూపీలోని పీలీభీత్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు తన కుమారుడు వరుణ్ గాంధీకి భాజపా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన తల్లి మేనకా గాంధీ పేర్కొన్నారు. -
పోలింగ్ ముగియగానే విలేకర్ల సమావేశం నిర్వహించండి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతి విడత పోలింగ్ ముగిశాక అదే రోజు విలేకర్ల సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ తదితర మీడియా సంఘాలు డిమాండ్ చేశాయి. -
‘టెంపో’ బిలియనీర్ల తోలుబొమ్మ మోదీ
‘టెంపో బిలియనీర్ల’ చేతిలో తోలుబొమ్మలాంటి 21వ శతాబ్దపు రాజు ప్రధాని నరేంద్రమోదీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM