Chandrababu: భాజపాతో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది: చంద్రబాబు

జనసేన, భాజపా పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated : 09 Mar 2024 17:20 IST

దిల్లీ: భాజపా, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో శనివారం దిల్లీ నుంచి ఆయన  టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘ఐదేళ్లలో జగన్‌ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరం. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవడానికి కేంద్రంతో కలిసి ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నాం. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి.. స్పష్టత వచ్చింది. పోటీ చేసే స్థానాలపై మరో సమావేశం తర్వాత నిర్ణయం ఉంటుంది. మా మధ్య ఎలాంటి గందరగోళం లేదు’’ అని తెలిపారు.

ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని మోదీ..

ఈనెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే 3 పార్టీల ఉమ్మడి బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పారు. ప్రధాని షెడ్యూల్‌లో మార్పులు ఉంటే 18న సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా భాజపా, జనసేనకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్‌ స్థానాలు ఇస్తున్నామని, ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందో రెండ్రోజుల్లో వెల్లడిస్తామని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని