Dhulipalla Narendra: తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. 

Published : 17 Nov 2023 00:50 IST

అమరావతి: పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం వాసి రాము ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న సంగం డెయిరీ వద్ద తమపై దాడి చేశారని రాము ఫిర్యాదులో పేర్కొన్నారు. పాల విక్రయానికి సంబంధించి 14 శాతం బోనస్‌ ఇవ్వలేదని రాము ఆరోపిస్తున్నారు. మాట్లాడదామని డెయిరీ వద్దకు పిలిచి కర్రలు, హాకీ స్టిక్‌లతో దాడి చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. దాడిలో తమ మూడు కార్లు ధ్వంసం అయ్యాయన్నారు. రాము ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని