కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. కాంగ్రెస్‌, భారాస నేతల మధ్య తోపులాట..

జగిత్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. కాంగ్రెస్‌, భారాస నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Updated : 09 Mar 2024 19:12 IST

జగిత్యాల: జగిత్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. కాంగ్రెస్‌, భారాస నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. శనివారం జగిత్యాల తహసీల్దార్‌ కార్యాయలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రారంభించారు. కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే, విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగిత్యాల భారాస ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో భారాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఇరువర్గాలను జీవన్ రెడ్డి శాంతింపజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని