Hassan Poll: అప్పుడు తాతలు.. ఇప్పుడు మనవళ్లు : దేవెగౌడ కోట ఎవరికో..?
Hassan Poll: ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ కంచుకోట హసన్లో పోరు ఆసక్తికరంగా మారింది. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఇద్దరు ప్రముఖ నేతల మనవళ్లు తాజాగా బరిలో ఉన్నారు.
హసన్: కర్ణాటకలోని హసన్ (Hassan).. ఒకప్పటి హొయసల సామ్రాజ్య రాజధాని. దేశానికి తొలి కన్నడిగ ప్రధానిని అందించిన నియోజకవర్గం. జేడీఎస్ అధినేత దేవెగౌడ (Deve Gowda)కు పెట్టని కోట. చారిత్రక వారసత్వ సంపదకు నిలయమైన ఈ ప్రాంతంలో లోక్సభ ఎన్నికల (Lok sabha Elections) పోరు ఈసారి మరింత రసవత్తరంగా మారింది. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల మధ్యే అధికార పోరు నడుస్తుండగా.. తాజా ఎన్నికల్లో వారి మూడోతరం తలపడుతోంది.
హసన్ నియోజకవర్గానికి మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ భాజపా-జేడీఎస్ (BJP-JDS) కూటమి అభ్యర్థిగా ఆయనే మరోసారి పోటీ చేస్తున్నారు. ప్రజ్వల్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ 31 ఏళ్ల శ్రేయస్ ఎం.పటేల్ను నిలబెట్టింది. ఈయన కర్ణాటక మాజీమంత్రి, దివంగత జి.పుట్టస్వామి గౌడ మనవడు. గతంలో ఇదే స్థానం నుంచి దేవెగౌడ, పుట్టస్వామిలు పోటీ చేయగా.. ఇప్పుడు వారి మనవళ్లు బరిలోకి దిగడం విశేషం.
నాడు దేవెగౌడను ఓడించి..
1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హొళెనరసిపుర స్థానం నుంచి అప్పటి జనతా పార్టీ అభ్యర్థిగా దేవెగౌడ పోటీ చేయగా.. ఆయనపై తొలిసారి పుట్టస్వామి నిలబడ్డారు. కాంగ్రెస్ (Congress) టికెట్ నిరాకరించినప్పటికీ స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి దేవెగౌడను ఓడించారు. ఇక, 1999 లోక్సభ ఎన్నికల్లో హసన్ నుంచి దేవెగౌడపై పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత మళ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుపొందలేకపోయారు.
ఆధిపత్యం వీరిదే..
హసన్ నియోజకవర్గం దేవెగౌడ కుటుంబానికి కంచుకోట లాంటిది. రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై వీరిదే ఆధిపత్యం. 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హొళెనరసిపుర శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ.. దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్.డి. రేవణ్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్.జి.అనుపమను నిలబెట్టినా ఓటమి తప్పలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్ పటేల్ (Shreyas M Patel) కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా.. కేవలం 3,152 ఓట్ల తేడాతో రేవణ్ణ చేతిలో ఓడిపోయారు.
మనవడి కోసం మాజీ ప్రధాని త్యాగం..
హసన్ లోక్సభ స్థానం నుంచి దేవెగౌడ ఐదుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మనవడి కోసం ఈ స్థానాన్ని త్యాగం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజ్వల్ 1.41లక్షల మెజార్టీతో విజయం సాధించారు. జేడీఎస్ తరఫున ఆ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ ఆయనే. కర్ణాటకలో ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జేడీఎస్-భాజపా జట్టుకట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ప్రజ్వల్ మరోసారి బరిలోకి దిగారు.
వక్కలిగల మద్దతు ఎవరికో..?
కర్ణాటకలో లింగాయత్ల తర్వాత రెండో అతిపెద్ద సామాజిక వర్గం అయిన వక్కలిగల ప్రాబల్యం హసన్లో చాలా ఎక్కువ. ఈ రెండు కుటుంబాలు ఇదే సామాజిక వర్గానికి చెందినవే అయినా ఉప కులాలు వేరు. పుట్టస్వామి దాస వక్కలిగ కాగా.. దేవెగౌడ కుటుంబానిది ముల్లు వక్కలిగ వర్గం. హసన్ నియోజకవర్గంలో దాస వక్కలిగ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం శ్రేయస్ పటేల్ కు కలిసొచ్చే అంశం. దీంతో 1999 నాటి తన తాత విజయాన్ని పునరావృతం చేయగలనని ఈయన ధీమాగా ఉన్నారు.
ఇక, ప్రజ్వల్పై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది. అవినీతి ఆరోపణలతో పాటు భాజపాతో పొత్తు పెట్టుకోవడం జేడీఎస్లో కొందరికి రుచించలేదు. అయితే, కుటుంబ ప్రాబల్యంతో పాటు మోదీ పాపులారిటీతో కాషాయ ఓటు బ్యాంకు కూడా తనకు దక్కుతుందని ఈ యువ ఎంపీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హసన్ పరిధిలో మొత్తం 8 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఇందులో నాలుగుచోట్ల జేడీఎస్ అధికారంలో ఉండగా.. భాజపా, కాంగ్రెస్కు చెరో రెండు స్థానాలున్నాయి. ఈ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. మరి దేవెగౌడ ‘కోట’ వీరిద్దరిలో ఈసారి ఎవరికి దక్కుతుందో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. -
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM