Andhra News: పోలవరం నిధులు మింగేసిన జగన్ జైలుకెళ్లడం ఖాయం: దేవినేని ఉమా
పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన డబ్బుల్ని ప్రభుత్వ పెద్దలు మింగేశారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు.
అమరావతి: పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన డబ్బుల్ని ప్రభుత్వ పెద్దలు మింగేశారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. దీనికి కారణమైన సీఎం జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఇందులో పోలవరం, రంపచోడవరం ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ అనంతబాబు హస్తం ఉందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందంటూ తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనను ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ఖండించలేదని నిలదీశారు. కేసీఆర్ నుంచి ఎన్నికల నిధులు తెచ్చుకోవడం వల్లే జగన్ మిన్నకుండిపోయారని విమర్శించారు.
సీఎఫ్ఎంఎస్ నుంచి ఆఫ్లైన్ పేమెంట్లు జరుగుతున్నాయని దేవినేని ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎఫ్ఎంఎస్ సిస్టంలో జరుగుతున్న పేమెంట్ల విధానంపై విచారణ జరిపితే జగన్ జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు. రూ.లక్ష కోట్లకు బిల్లులు చెల్లిస్తే అందులో సజ్జల గిల్లుడు రూ.20వేల కోట్లని ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్ విధానాన్ని మంచి కోసం ప్రవేశపెడితే .. ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కాగ్ అడుగుతున్న ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఉమా ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
భారాస నేత, మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM