ఎమ్మెల్యేలను తరలిస్తున్న కాంగ్రెస్
గుజరాత్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. అధికార భాజపాకు తమ ఎమ్మెల్యేలు చిక్కకుండా వారిని వేర్వేరు చోట్లకు తరలిస్తోంది.
అహ్మదాబాద్: గుజరాత్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. అధికార భాజపాకు తమ ఎమ్మెల్యేలు చిక్కకుండా వారిని వేర్వేరు చోట్లకు తరలిస్తోంది. ఈ నెల 26న ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముందుగానే వారిని తరలింపు ప్రక్రియ వేగవంతం చేసింది. సుమారు 12 మంది ఎమ్మెల్యేలు శనివారం అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో కనిపించారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. వీరిని తరలిస్తుండడం గమనార్హం.
మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను భాజపా ముగ్గురు, కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపింది. 182 స్థానాలున్న శాసనసభలో భాజపాకు 103 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్కు 73 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు గెలవాలంటే 74 మంది అవసరం ఉండగా.. ఇప్పటికే స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. అయితే, భాజపా ముగ్గురిని బరిలోకి దింపింది. ముగ్గురిని గెలిపించుకోవాలంటే భాజపాకు 111 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీంతో భాజపా కాంగ్రెస్ సభ్యులను ఎక్కడ తమవైపు తిప్పుకొని క్రాస్ ఓటింగ్కు పురిగొల్పుతుందోనని హస్తం పార్టీ తమ ఎమ్మెల్యేలను తరలిస్తోంది. దీంతో వారిని వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తోంది. ముఖ్యంగా తమ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..