ఎస్ఈసీ కేవియట్ ఎందుకు వేసింది: బుగ్గన
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికలు వాయిదా వేసేముందు ప్రభుత్వంతో
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికలు వాయిదా వేసేముందు ప్రభుత్వంతో ఎస్ఈసీ చర్చించారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖకు లేఖరాయడమేంటని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే మంత్రి పదవులు పోతాయని సీఎం హెచ్చరించినట్లు ఎస్ఈసీ లేఖలో పేర్కొన్నారు..ఆయన వద్ద ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారు. ఇలాంటి లేఖలు ఎన్నికల కమిషనర్ రాయకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖకు లేఖ రాశారో లేదో ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ తేల్చి చెప్పాలని ఆర్థికమంత్రి బుగ్గన డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు సీఎం జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.
‘‘ కరోనా గురించి తెలుసు కనుకే ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. కరోనా వల్ల వాయిదా వేస్తే ఎన్నికల కోడ్ ఆరు వారాలపాటు ఎందుకు ఉంచారు?. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు కోడ్ అడ్డు రాదా? కరోనాపై సీఎస్, వైద్యశాఖ అధికారులతో సమీక్ష జరిపారా?. స్థానిక ఎన్నికలు ఆపాలని ఎవరైనా కుట్ర చేస్తున్నారా? ఎన్నికలు ఆపేందుకు తోమర్ కేసును ఎందుకు వాడుతున్నారు. స్థానిక ఎన్నికలు పెట్టేముందు ప్రభుత్వంతో సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్ఈసీ బాధ్యతగా పనిచేయాలి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేవియట్ ఎందుకు దాఖలు చేశారు. ఇదేమైనా వ్యక్తిగత వివాదమా?. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలపై నిందలు వేస్తున్నారు. గత ఎన్నికల కమిషనర్ జేకే ద్వివేదీపై చంద్రబాబు ఎలా మాట్లాడారు? డోన్ నియోజకవర్గం గురించి చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారు’’ అని మంత్రి బుగ్గన ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం
-
ప్రభాకర్రావు కోసం పోలీసుల వేట .. అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
-
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్