అగమ్యగోచరంగా భారాస పరిస్థితి: మల్లురవి

భారాస లక్క ఇల్లు లాంటిదని, ఓటమి మంటల్లో చిక్కుకొని కాలిపోతుండడంతో ఆ పార్టీ నాయకులు బయటపడుతున్నారని దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి అన్నారు.

Published : 18 Mar 2024 05:37 IST

ఈనాడు, దిల్లీ: భారాస లక్క ఇల్లు లాంటిదని, ఓటమి మంటల్లో చిక్కుకొని కాలిపోతుండడంతో ఆ పార్టీ నాయకులు బయటపడుతున్నారని దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి అన్నారు. ఆయన ఆదివారం దిల్లీలో తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. భారాస పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని, అందుకే తాము అడగకుండానే ఆ పార్టీ నేతలు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నారని అభిప్రాయపడ్డారు. భాజపా, భారాస మధ్య రహస్య ఒప్పందం ఉన్నందునే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందురోజు కవితను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. దిల్లీలో ఏపీభవన్‌ ఆస్తుల విభజన పూర్తయినందున త్వరలో కొత్త తెలంగాణ భవన్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని