మా కండువా మారలేదు.. మారింది మీదే: మందకృష్ణ
మా నల్ల కండువా మారలేదు..మీ మెడలో ఎన్ని కండువాలో మారాయో తెలుసు. కేసీఆర్పై రేవంత్రెడ్డి చేయించింది డూప్లికేట్ యుద్ధం.
ఖైరతాబాద్, న్యూస్టుడే: ‘మా నల్ల కండువా మారలేదు..మీ మెడలో ఎన్ని కండువాలో మారాయో తెలుసు. కేసీఆర్పై రేవంత్రెడ్డి చేయించింది డూప్లికేట్ యుద్ధం. మేము దిగితే ప్రత్యక్ష యుద్ధమే’నని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగల సహకారంతోనే మొదట్నుంచి రాజకీయాల్లో ఎదిగానని రేవంత్రెడ్డి ఇటీవల చెప్పిన వీడియోలను ఆయన శనివారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో ప్రదర్శించారు. రేవంత్ ఇప్పుడు మాదిగలను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. నాగర్కర్నూల్లో సంపత్కుమార్కు టికెట్ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచింది ఆయనేనని ఆరోపించారు. తాను భాజపాకు మద్దతు ఇస్తున్నాననే సంపత్తో మాట్లాడించారని, వర్గీకరణ పట్ల సానుకూలంగా ఉన్నందుకే భాజపాకు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ, కార్యదర్శి వీఎస్ రాజు, జాతీయ అధికార ప్రతినిధి బొర్ర భిక్షపతి, హైదరాబాద్ అధ్యక్షుడు పీవీ నర్సింహ, కార్యనిర్వాహక అధ్యక్షుడు అజిత్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర నేతల అంతమే మోదీ లక్ష్యం
తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. -
విపక్ష నేతలకు రాసిన లేఖపై మీరు స్పందించడం ఆశ్చర్యమే
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలకు తాను రాసిన లేఖపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్, సిసోదియా వంటి వారిని భాజపా ఆహ్వానించదు
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలను భాజపాలోకి ఎప్పటికీ ఆహ్వానించబోమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ స్పష్టం చేశారు. -
వరుణ్కు టికెట్ ఇస్తే బాగుండేది: మేనకా గాంధీ
యూపీలోని పీలీభీత్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు తన కుమారుడు వరుణ్ గాంధీకి భాజపా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన తల్లి మేనకా గాంధీ పేర్కొన్నారు. -
పోలింగ్ ముగియగానే విలేకర్ల సమావేశం నిర్వహించండి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతి విడత పోలింగ్ ముగిశాక అదే రోజు విలేకర్ల సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ తదితర మీడియా సంఘాలు డిమాండ్ చేశాయి. -
‘టెంపో’ బిలియనీర్ల తోలుబొమ్మ మోదీ
‘టెంపో బిలియనీర్ల’ చేతిలో తోలుబొమ్మలాంటి 21వ శతాబ్దపు రాజు ప్రధాని నరేంద్రమోదీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ