మా కండువా మారలేదు.. మారింది మీదే: మందకృష్ణ

మా నల్ల కండువా మారలేదు..మీ మెడలో ఎన్ని కండువాలో మారాయో తెలుసు. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేయించింది డూప్లికేట్‌ యుద్ధం.

Updated : 24 Mar 2024 06:24 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ‘మా నల్ల కండువా మారలేదు..మీ మెడలో ఎన్ని కండువాలో మారాయో తెలుసు. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేయించింది డూప్లికేట్‌ యుద్ధం. మేము దిగితే ప్రత్యక్ష యుద్ధమే’నని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగల సహకారంతోనే మొదట్నుంచి రాజకీయాల్లో ఎదిగానని రేవంత్‌రెడ్డి ఇటీవల చెప్పిన వీడియోలను ఆయన శనివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రదర్శించారు. రేవంత్‌ ఇప్పుడు మాదిగలను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్‌లో సంపత్‌కుమార్‌కు టికెట్‌ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచింది ఆయనేనని ఆరోపించారు. తాను భాజపాకు మద్దతు ఇస్తున్నాననే సంపత్‌తో మాట్లాడించారని, వర్గీకరణ పట్ల సానుకూలంగా ఉన్నందుకే భాజపాకు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ నరేశ్‌ మాదిగ, కార్యదర్శి వీఎస్‌ రాజు, జాతీయ అధికార ప్రతినిధి బొర్ర భిక్షపతి, హైదరాబాద్‌ అధ్యక్షుడు పీవీ నర్సింహ, కార్యనిర్వాహక అధ్యక్షుడు అజిత్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు