‘ఇండియా’ కూటమి నేతల బెదిరింపులను కట్టడి చేయాలి
కాంగ్రెస్ సహా ‘ఇండియా’ కూటమి నేతల భాష దూషణలు, బెదిరింపులతో కూడుకొని ఉంటోందని, ఈసీ వాటిని సుమోటోగా పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని భాజపా గురువారం డిమాండ్ చేసింది.
ఈసీకి భాజపా డిమాండ్
దిల్లీ: కాంగ్రెస్ సహా ‘ఇండియా’ కూటమి నేతల భాష దూషణలు, బెదిరింపులతో కూడుకొని ఉంటోందని, ఈసీ వాటిని సుమోటోగా పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని భాజపా గురువారం డిమాండ్ చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీని 400 అడుగుల లోతున పాతిపెట్టాలని ఝార్ఖండ్కు చెందిన జేఎంఎం నేత నజరుల్ ఇస్లాం వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. దేశ ప్రజలు ఎన్నుకొన్న ప్రధాని గురించి ఇలా మాట్లాడటం ‘ఇండియా’ కూటమి నేతల మానసిక పరిస్థితిని సూచిస్తోందన్నారు. నజరుల్ ఇస్లాం వ్యాఖ్యలను భారత ఎన్నికల సంఘం సుమోటోగా పరిగణనలోకి తీసుకొని, ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కర్ణాటకలో ఎంపీగా పోటీచేస్తున్న తన సోదరుడు డీకే సురేశ్కు ఓటు వేయకపోతే నీటి సరఫరా ఉండదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హౌసింగ్ సొసైటీ ఓటర్లను ఇటీవల బెదిరించినట్లు పూనావాలా తెలిపారు. ఆ రాష్ట్ర మంత్రి డి.సుధాకర్ సైతం కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే రూ.25 కోట్ల ప్రత్యేక గ్రాంటు నిలిచిపోతుందని ఓటర్లను బెదిరించారన్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలనూ ఈసీ సుమోటోగా పరిగణనలోకి తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రధానిని కించపరిచేలా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ నజరుల్ ఇస్లాం బుధవారమే ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, 400కు పైగా సీట్లు గెలుస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ఖండనగా అలా మాట్లాడినట్లు వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
భారాస నేత, మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM