వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి
వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
ఆలూరు గ్రామీణ, ఆలూరు, న్యూస్టుడే: వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో ఆమె ప్రసంగించారు. ‘‘నగరడోణ జలాశయం ఏర్పాటు కోసం గతంలో రాజశేఖరరెడ్డి ఓ శిలాఫలకం ఆవిష్కరిస్తే.. దాని పక్కనే జగన్ మరోటి వేశారు తప్ప రిజర్వాయర్ పూర్తిచేయలేదు. కడప స్టీల్ప్లాంటుకూ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్.. ఇలా శంకుస్థాపనలే చేశారు. పాలనలు ఇలా శంకుస్థాపనలకే పరిమితమైతే.. అభివృద్ది ఏం జరుగుతుంది. ప్రజలు ఎలా బాగుపడతారు? పశ్చిమప్రాంత ప్రాంత రైతులను ఆదుకునేందుకు టమాటా జ్యూస్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్లు నిర్మిస్తామని చెప్పి అయిదేళ్లు పూర్తయ్యాయి. అవేమీ రాలేదు గానీ, ఎన్నికలు మళ్లీ వచ్చాయి. ఓటు ఇలాంటి వారికి వేసినా.. మురుగులో వేసినా ఒకటే. ఇలాంటి చెత్త నాయకులకు అధికారం కట్టబెట్టొద్దు. మంచివాళ్లకు ఓటు వేయకపోతే మీకు, మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండదన్నారు. ఆదోని సభలో షర్మిల మాట్లాడుతుండగా.. వైకాపా నాయకులు ఓ మేడపై నుంచి ‘సిద్ధం’ జెండాలను చూపించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. మిమ్మల్ని ఇంటికి సాగనంపేందుకు మేము సిద్ధమే అని ధీటుగా బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
భారాస నేత, మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM