KTR: 50 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని వారిని పట్టించుకోవద్దు: కేటీఆర్
బీసీ బంధు పథకం కొంతమందికే పరిమితం కాదని.. రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ బీసీ బంధు పథకం కింద 600 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
సిరసిల్ల: బీసీ బంధు పథకం కొంతమందికే పరిమితం కాదని.. రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం బీసీ బంధు పథకం కింద 600 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బీసీ బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయం మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. చెక్కుల పంపిణీ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
‘‘కేసీఆర్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం. మనసున్న ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయి. ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో అర్హులకు 800 పట్టాలు అందిస్తున్నాం. దాంతో పాటు సొంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద ఒక్కొక్కరికి రూ.3లక్షలు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3వేల మంది చొప్పున అర్హులను ఎంపిక చేస్తాం. వారందరికీ న్యాయం చేస్తాం. 50 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని వారి మాటలు పట్టించుకోవద్దు. వాళ్లు ఏం చేసినా మేం పట్టించుకోవాలనుకోవడం లేదు.
అయితే, వారు మీ దగ్గరకు వస్తే ఒకటే అడగండి. ఇవాళ మాట్లాడుతున్న మీరు.. మీ హయాంలో రూ.200 మాత్రమే పింఛను ఎందుకిచ్చారని ప్రశ్నించండి. నీరెందుకు ఇవ్వలేదని నిలదీయండి. ప్రజలు చైతన్యం ప్రదర్శించాలి. పని చేసే ప్రభుత్వాలు, నాయకులను ప్రజలు కాపాడుకోవాలి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రజలు ఆగం కావొద్దు. నేను ఇంతవరకు మద్యం, డబ్బులు పంచలేదు. ఇకపై కూడా పంచను. మీ దయ ఉంటే మరోసారి గెలుస్తా. లేకపోతే ఇంట్లో కూర్చుంటా. ఇప్పుడు ఉన్న విధంగానే భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేస్తా. కులం, మతం అనే పిచ్చి లేకుండా అవసరమైన పని చేసే బాధ్యత నాది. అందరికీ అండగా ఉంటా’’ అని కేటీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
ఐదేళ్లలో ఎస్సీల సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. -
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
జగన్ ఫొటోలు ఉన్న పాసు పుస్తకాల నకళ్ల దహనానికి తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకుని దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. -
జనసేనకు వంగ లక్ష్మణ్గౌడ్ రాజీనామా
జనసేన తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం తాజ్కృష్ణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
కడపలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
-
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి